కన్న బిడ్డను కాడెద్దుగా మార్చిన ఓ రైతు.. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలాన్ని చదను చేశాడు. తండ్రి అరకు పట్టి.. చేను దున్నుతుంటే.. ఓ వైపు కాడెద్దుగా మారి కొడుకు ముందుకు కదిలాడు. వానలు కురుస్తున్న వేళ.. తాను వెనుకబడి పోతానన్న దిగులు.. జోడెడ్లలో ఒకటి ఇటీవలే మరణించిందన్న అవేదన.. అతనిలో నైరాశ్యాన్ని నింపగా.. తాను కాడెద్దునై ముందుకు సాగుతానన్న భరోసా ఇచ్చిన తనయుడు సాగులో సహకరించి…తండ్రికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. నేలతల్లిని నమ్ముకుని సేద్యం చేసే అన్నదాతకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా..కాడిని వదలరని ఈ దృశ్యమే నిదర్శనం.
రైతు అంటేనే చిన్నచూపు.. వ్యవసాయం అంటేనే అర్థం తెలియని వాళ్లు ఇప్పటికీ మనీ కోసం వెంపర్లాడుతూ సోకాల్డ్ హైఫై జీవితాలను గడిపేస్తూ వుంటారు. అయితే రైతు వ్యవసాయాన్ని నమ్మినంతగా దేనినీ నమ్మడని.. అవసరమైతే తన సంతానాన్నే కాడెద్దుగా మార్చి వ్యవసాయం చేస్తాడని, మానవజాతికి అన్నం పెడతాడని మరోమారు రుజువు చేసింది ఈ ఘటన. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్ గ్రామంలో ఓ రైతు నివాసం ఉంటున్నాడు. తొలకరి పలకరించడం..వర్షాలు పడడంతో పొలం పండించేందుకు సిద్ధమయ్యాడు. ఇతనికి ఆరు ఎకరాల పొలం ఉంది.
అయితే..అతనికున్న రెండు కాడెద్దుల్లో ఒక ఎద్దు అకస్మాత్తుగా చనిపోయింది. దీంతో ఆ రైతు తీవ్ర ఆందోళన చెందాడు. మరో ఎద్దు కొనాలంటే..ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఏమి చేయాలో పాలుపాలేదు. పత్తి విత్తనాలు వేయకపోతే..వెనుకబడి పోతానని గ్రహించాడు. కొడుకు సాయినాథ్ తండ్రి ఆందోళనను గ్రహించాడు. తాను కాడిని దున్నుతానని చెప్పాడు. అయితే..చదువుకోవాల్సిన సమయంలో..ఇలాంటివి ఎందుకని తండ్రి గ్రహించాడు. కానీ.. చివరకు కొడుకు చేసిన ప్రతిపాదనకు ఒకే చెప్పాడు. ఒక వైపు ఎద్దు ..మరోవైపు..కొడుకుతో పొలం దున్నాడు. ఈ విషయం తెలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నా.. వారికి రూ. 20 వేలు సాయంగా అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more