యోగాగురు బాబా రాందేవ్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఉత్తరాఖండ్ శాఖ రూ. వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసింది. అల్లోపతి వైద్యవిధానంపై బాబా రాందేవ్ అవాక్కులు చవాక్కులు పేలిన నేపథ్యంలో అలోపతి వైద్యుల ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడంపై ఉత్తరాఖండ్ కు చెందిన ఐఎంఏ డాక్టర్ల సంఘం ఈ మేరకు ఆయనపై పరువు నష్టం నోటీసును పంపించింది. అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు.. పూర్తిగా తప్పుడు వ్యాఖ్యలని అంగీకరిస్తూ ఓ వీడియో సందేశాన్ని మీడియా ద్వారా యావత్ దేశ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
ఇందుకుగానే కేవలం 15 రోజుల వ్యవధిని ఇస్తూ.. క్షమాపణలు చెప్పని పక్షంలో బాబా రాందేవ్ రూ. 1000కోట్లను ఇవ్వాలని ఐఎంఏ జారీ చేసిన నోటీసులతో పేర్కోంది. కోవిడ్ వైరస్ ను తగ్గించేందుకు అల్లోపతి విధానం పనికిరాదని బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు అనేకం చేసినా.. వాటిపై పెద్దగా విమర్శలు వచ్చినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాత్రం డాక్టర్ల సంఘం భగ్గుమంది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కూడా లేఖ రాసీన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్ పై రాజద్రోహం కేసులు నమోదు చేయాలని కూడా కోరింది.
రాందేవ్ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్కు కూడా ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ లేఖ రాసింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. దీంతో తన వ్యాఖ్యలపై బాబా రాందేవ్ వెనక్కి తగ్గారు. అల్లోపతి వైద్యంపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. అదే సమయంలో అల్లోపతి డాక్టర్లు సమాధానం చెప్పాలంటూ.. 25 ప్రశ్నలను సంధించారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వివాదంపై ట్వీట్ ద్వారా చెప్పిన క్షమాపణ సరిపోదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటోంది. అల్లోపతి వైద్యాన్ని, వైద్యులను కించపరిచేలా మాట్లాడిన బాబా రాందేవ్ లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more