ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు ఆయన నియోజికవర్గానికి మాత్రమే ఆయన తెలుసు. కానీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే యావత్ దేశప్రజలకు పరిచయం అయ్యాడు. అదేంటి అంటే ఆ రాష్ట్ర ప్రజలకు మాత్రమే తెలుసు కాదా.? అంటారా.. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ యావత్ దేశ ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నాడు. మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అమెరికా భారత దేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించిందని.. అయినా కరోనాను ఎదుర్కోవడంలో భారత్ తీసుకున్న నిర్ణయాలు దేశప్రజలకు రక్షణగా నిలువగా అమెరికా మాత్రం కరోనా కల్లోలంతో కొట్టుమిట్టాడిందని వ్యాఖ్యలు చేశారు. ఇందులో తప్పేముంది అంటారా.? అమెరికా ఎప్పుడు భారత్ ను పాలించలేదు.. పాలించే అవకాశం కూడా లేదు. కానీ మరీ సీఎం అలా ఎందుకు అన్నారో తెలియదు. బహుశా బ్రిటుషు అనుకుని పోరబడి అమెరికా అన్నారేమో కానీ.. అక్కడి అధికారులు కూడా ఆయనను సరిచేయలేదు. ఇక దీనిపై నెట్ జనులు వ్యంగోక్తులు విసురుతున్నారు.
ఇక అదే సభలో ఆయన మరో వివాదానికి కూడా తేరలేపాడు. ‘‘ప్రభుత్వం అందించే రేషన్ ఎక్కువ కావాలనుకునేవారు మరింత మంది పిల్లలను కనాల్సింది కదా’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేద కుటుంబాలకు కేంద్రం ఒక్కోక్కరికి 5కేజీల రేషన్, పప్పు దినుసులు అందిస్తోందని అయితే వంది కిలోల రేషన్ వచ్చినవారిని చూసి పది కిలోల రేషన్ తీసుకున్నవారు అక్కస్సుతో రగిలిపోయారని అన్నారు. మీరు ఇద్దరే వుంటే మీకు అంతే రేషన్ వస్తోంది కదా.. మీకు అవకాశం వున్నప్పుడు పది మందికి బదులు ఇద్దరితోనే సరిపెట్టుకున్నారు.. ఇప్పుడు వారిపై అక్కస్సు ఎందుకుని ఆయన తనదైన స్టైయిల్ లో కాంట్రవర్సీకి కాలుదువ్వారు.
#WATCH "...As opposed to other countries, India is doing better in terms of handling #COVID19 crisis. America, who enslaved us for 200 years and ruled the world, is struggling in current times," says Uttarakhand CM Tirath Singh Rawat pic.twitter.com/gHa9n33W2O
— ANI (@ANI) March 21, 2021
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తీరత్ తొలిసారి మహిళల వస్త్రాధారణపై వ్యాఖ్యలు చేశారు. మహిళలు తమ వస్త్రాధారణతో సభ్యసమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంతో తాను ఎదుర్కోన్న ఘటనను వివరించారు. తనతో పాటు విమానంలో ప్రయాణించిర ఓ మహిళ రిప్డ్ జీన్స్ వేసుకుందని, తీరా చూస్తే అమె ఇద్దరు పిల్లల తల్లి అని..వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక భవిష్యత్తులో ఈ తీరథ్ సింగ్ రావత్ మరెన్ని కాంట్రవర్సీలకు కాలుదువ్వుతారో వేచి చూడాల్సిందే. మరి ఇతనిపై అధిష్టానం ఏమైనా ఆంక్షలను విధించే అవకాశాలు వున్నాయేమో చూడాలి.
#WATCH हर घर में पर यूनिट 5 किलो राशन दिया गया।10 थे तो 50 किलो, 20 थे तो क्विंटल राशन दिया। फिर भी जलन होने लगी कि 2 वालों को 10 किलो और 20 वालों को क्विंटल मिला। इसमें जलन कैसी? जब समय था तो आपने 2 ही पैदा किए 20 क्यों नहीं पैदा किए: उत्तराखंड CM मुख्यमंत्री तीरथ सिंह रावत pic.twitter.com/cjh2hH5VKh
— ANI_HindiNews (@AHindinews) March 21, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more