ఏపీలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిణ కొనసాగుతోంది. మొత్తం 2,214 డివిజన్, వార్డు స్థానాల్లో 580 ఏకగ్రీవం కాగా మిగిలిన డివిజన్, వార్డులకు పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. అలాగే, నాలుగు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 71 మునిసిపాలిటీలు, 12 నగర పాలక సంస్థల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు పురపాలక సంఘాలలో 32.23 శాతం ఓటింగ్ నమోదయ్యిందని సమాచారం. మున్సిఫల్ ఎన్ినకల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తున్న అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనేక మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కాగా జిల్లాలా వారీగా మధ్యాహ్నం 11 గంటల వరకు నమోదైన పర్సెంటేజీ వివరాలు ఇలా వున్నాయి. శ్రీకాకుళం 24.58, విజయనగరం 31.97, విశాఖపట్నం 28.5, తూర్పుగోదావరి 36.31, పశ్చిమగోదావరి జిల్లా 34.14, కృష్ణా జిల్లా 32.64, గుంటూరు జిల్లా 33.62, ప్రకాశం జిల్లా 36.12, అనంతపురం 31.36, నెల్లూరు 32.67, చిత్తూరు 30.21, కడప 32.82, కర్నూలు 34.12 శాతం పోలింగ్ నమోదైంది.
మొత్తంగా 7,549 మంది అభ్యర్థులు ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, 77,73,231 మంది తమ ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సక్రమ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బంధీగా ఏర్పాటు చేసింది. పోలింగ్ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసేందుకు జిల్లాకు ఓ నోడల్ అధికారిని ప్రత్యేకంగా నియమించింది. నోడల్ అధికార వ్యవస్థ ద్వారా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాటు చేసింది. 12 నగరపాలకసంస్థలకు, 71 మున్సిపాలిటీలకు మొత్తంగా 26,835 మరియు 21,888 మంది ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక పోరులో భాగంగా పొలింగ్ సరళి పరిశీలించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. జిల్లా కలెక్టర్ ఏ.ఎండి ఇంతియాజ్తో కలిసి విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఎస్ఈసీ పరిశీలించారు. వృద్ధులు, యువకులు, మహిళా ఓటర్లతో ఆయన మాట్లాడారు. పోలింగ్, క్యూ లైన్లపై ఓటర్ల స్పందన అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఒక్కరూ రాజ్యంగం కల్పించిన ఓటు హక్కును తమ బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన విజ్ణప్తి చేశారు. ఓటు వేయడానికి 75 సంవత్సరాల టంకాశాల సుబ్బమ్మ వచ్చి క్యూలైన్లో నిలబడటంతో అమెను ఆయన అభినందించారు.
పురపాలక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని, విశాఖ జిల్లా భీమిలి నేరెళ్లవలసలో అవంతి శ్రీనివాస్, వైఎస్సార్ జిల్లా కడప 29వ డివిజన్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రకాశం జిల్లా ఒంగోలు 34వ డివిజన్లో బాలినేని శ్రీనివాస్రెడ్డి తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. ఏపీ వైద్యశాఖా మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతైంది. దీంతో ఆయన అధికారులను నిలదీసినా ఓటు హక్కు వేసే అవకాశం లేకపోవడంతో, ఏలేరు 25వ డివిజన్ లోని శనివారపు పేట ఎంపీయూపీ పాఠశాలలోని కేంద్రం నుంచి వెనుదిరిగారు.
గుంటూరులో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థంబాల గరువులోని ఉర్దూ పాఠశాలలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, బుచ్చయ్యతోటలోని పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఓటు వేశారు. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాఖపట్నం 14 వార్డులోని మారుతీనగర్ పోలింగ్ కేంద్రం-11లో ఆయన ఓటేశారు. మాజీ ఎంపీ సబ్బం హరి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబరు 4లో పవన్ ఓటు వేశారు. అలాగే, ఎమ్మెల్సీ అశోక్బాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more