కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో ఎన్నికలను జరగనున్న కేరళ రాష్ట్రంలో పర్యటిస్తూ.. అక్కడి కొల్లాం జిల్లాలోని మత్య్సకారుల సమస్యలను తెలుసుకునేందుకు వారితో కలసి సముద్రయానం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు సముద్రంలో వారితో గడిపిన ఆయన.. వారి సమస్యలను క్షుణ్ణంగా అవగతం చేసుకున్నారు. తాను చాలా పర్యాయాలు చేపలను తిన్నానని, అయితే ఎప్పడు ఈ చేపలు ఎలా తన ముందుకు బోజనంగా వచ్చాయన్న విషయాలపై తాను శ్రద్దపెట్టలేదని.. కానీ ఇవాళ తనకు ఈ విషయం పూర్తిగా అవగతమైందని అన్నారు.
మత్య్సకార్మికులు ఎంతటి కష్టనష్టాలకు, వ్యయప్రయాసలకోర్చి సముద్రంలోని చేపలను తమకు అందుబాటులోకి తీసుకువస్తున్నారో తాను వారితో కలసి చేపలు పట్టడం ద్వారా అర్థమైందని అన్నారు. ఈ క్రమంలో సముద్రంలోకి వలలు వేసిన తరువాత కొందరు మత్స్యకారులు సముద్రంలోకి దూకి ఈత కొట్టారు. వారిని చూసిన రాహుల్ గాంధీ కూడా తాను సముద్రంలోకి దూకి ఈతకొట్టారు. ఈత కొడుతూ తనతో పాటు దూకిన మత్స్యకారులతో మాట్లాడుతూ ఏకంగా పదినిమిషాలకు పైగానే రాహుల్ సముద్రంలో ఈతకోట్టారు.
నీలి రంగు టీ షర్టు, కాకీ వర్ణ ఫ్యాంటు ధరించిన రాహుల్ గాంధీ తిరుగు ప్రయాణంలో తడిచిన బట్టలతోనే తన్గస్సెరీ బీచ్ వద్దకు చేరుకున్న తరువాత తన దుస్తులను మార్చుకున్నారు. తాను మాకెవరికీ చెప్పకుండా సముద్రంలోకి దూకీ ఈత కోట్టారు. ఆయన ఆకస్మికంగా చేసిన పనితో తాము తొలుత నివ్వెరపోయామని, అయితే సముద్రంలోకి దూకిన ఆయన చాలా ప్రశాంతంగా పది నిమిషాల పాటు ఈత కొట్టారని ఓ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more