దేశ రాజధాని ఢిల్లీలోని డాక్టర్ ఏబీజే అద్బుల్ కలామ్ రోడ్డులోని ఇజ్రాయిల్ దౌత్యకార్యాలయంపై దాడిలో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. సిసిటీవీ పూటేజీని పరిశీలించిన పోలీసులు పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు క్యాబ్ లో అక్కడ దిగారని గుర్తించి.. క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు,. వీరికి పేలుడుకు ఏమైనా లింక్ వుందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. డ్రైవర్ తెలిపిన వివరాల ఆధారాల వారి ఊహాచిత్రాలను గీయిస్తున్నారు. పేలుడులో అమ్మెనియం నైట్రేట్ ను వినియోగించినట్లు తేలడంలో పెద్ద కుట్రే వుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాంబు పేలుడు జరిగిన ఘటనాస్థలికి కొద్దిదూరంలో సగం కాలిన గులాబి రంగు చెన్నీతో పాటు ఓ ఎన్వలప్ ను పోలీసులు గుర్తించారు. ఈ ఎన్వలప్ లో లో రాయభారిని ఉద్దేశిస్తూ ఓ లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇరాన్ గతేడాది మరణించిన అగ్రశ్రేణి కమాండర్ ఖాసి సలేమాని, శాస్త్రవేత్త ఫక్రజాదే పేర్లు వున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజా పేలుడు ఇరాన్ కు సంబంధం వుండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఈ దాడి కేవలం ట్రైయిలర్ మాత్రమేనని కూడా ఆ లేఖలో పేర్కోన్నారని తెలుస్తోంది.
కాగా, ఈ ఘటనలో తమ ఉద్యోగులు, సిబ్బంది, దౌత్యాధికారులు అందరూ సురక్షితంగానే వున్నారని ఇజ్రాయిల్ రాయబారి రోన్ మల్కా తెలిపారు. ఈ బాంబు పేలుడు ఘటన తమకు ఏమాత్రం అశ్చర్యం కలిగించలేదని చెప్పిన ఆయన ఈ ఘటనను ముందే ఊహించామని అన్నారు. ఇది ముమ్మాటికీ ఉద్రవాద దాడేనని పేర్కోన్నారు. భారత్ తో పాటు యావత్ ప్రపంచంలోని అన్ని ఇజ్రాయిల్ ఎంబసీలనూ లక్ష్యం చేసుకున్నారని అన్నారు. ఈ ఘటనపై భఆరత్ తో కలసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. భారత్ తో తమ దేశ ఎంబసీ 29వ వార్సీకోత్సవ రోజున ఉద్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more