ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వున్న అక్రమాస్థుల కేసుల్లో కదలిక రాష్ట్రంలో ఒక్కసారిగా కుదుపుకు గురిచేసింది, ఈ కేసులో ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు.. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ సహా విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అరంబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, టైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
జడ్చర్ల సెజ్ లో అరబిందో, హెటిరో సంస్థలకు భూ కేటాయింపుల్లో క్విడ్ ప్రోకో జరిగిందని సీబీఐ, ఈడీ అభియోగం. అరబిందో, హెటిరో సంస్థలకు చెరో 75 ఎకరాలను ధరల నిర్ణయాక కమిటీ నిర్ణయానికి విరుద్ధంగా ఎకరం రూ.7లక్షల చొప్పున వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించినట్టు సీబీఐ, ఈడీ చార్జీషీట్లలో పేర్కొన్నాయి. మెదక్ జిల్లా పాశమైలారంలో అరబిందో సంస్థకు గతంలో ఏపీఐఐసీ కేటాయించిన 30 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్కు బదలాయించినట్టు మరో అభియోగం. దాని వల్ల అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి బావమరిది పి.శరత్ చంద్రారెడ్డి ఎండీగా ఉన్న ట్రైడెంట్ సంస్థ రూ.4.33 కోట్లు అక్రమంగా లబ్ధి పొందినట్టు అభియోగం.
వీటికి ప్రతిఫలంగా అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి రూ.10కోట్లు, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి రూ.17.25 కోట్లు జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ ఫ్రా సంస్థల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించారని సీబీఐ, ఈడీ అభియోగ పత్రాల సారాంశం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేసిన ఈడీ.. హెటిరో, అరబిందో, జననీ ఇన్ ఫ్రా, జగతి పబ్లికేషన్స్ కు చెందిన సుమారు రూ.51 కో ట్ల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేసి స్వాధీనం చేసుకోగా.. వాటిపై అప్పీలేట్ ట్రైబ్యునల్ స్టే ఇచ్చింది. అప్పీలేట్ ట్రైబ్యునల్ ఉత్తర్వులపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అరబిందో, హెటిరోకు భూకేటాయింపులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2016లో నాంపల్లి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయగా.. ఇటీవల సీబీఐ, ఈడీ కోర్టుకు బదిలీ అయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more