(Image source from: Ndtv.com)
యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని కీర్తించుకునే మన నేతలు అదే ప్రజాస్వామ్యానికి ప్రాణంతో ముడిపెట్టడం ఎంత దారుణమైన పరిస్థితి అంటూ ఆర్జీడి యువనేత తేజస్వీ యాదవ్ తనదైన శైలిలో విమర్శించారు. ఓటరు జీవితాన్ని రాజకీయ పార్టీ నిర్థేశించే స్థాయికి దిగజారిపోయామా.? అంటూ ఆయన అవేదన వ్యక్తం చేశారు, ఈ ఏడాది పంద్రాగస్టున ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వాక్సీన్ అందిస్తామని సందేశాన్ని ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి చెందిన పార్టీ బీహార్ లో మాత్రం తాము అధికారంలోకి వస్తేనే అందరికీ ఉచితంగా టీకాను అందిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో పేర్కోని మనిషి జీవితానికి ఓటుకు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరోనా టీకాను ఉచితంగా అందజేస్తామన్న హామీని బీజేపి తమ మానిఫెస్టోలో పేర్కోనడం.. దానిని ఎన్నికల కమీషన్ కూడా సమర్ధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తేజస్వీ యాదవ్ లేఖాస్త్రాన్ని సంధించారు, గతంలో ఇచ్చిన హామీలను ప్రధాని మర్చిపోయారని ఇప్పుడు కూడా వాటి ఊసే ఎత్తకుండా కొత్త హామీలతో బీజేపి రాష్ట్రప్రజల ముందకు రావడంపై ఆయన విమర్శలను కురిపించారు. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీన తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాసిన రెండు పేజీల లేఖను ఈ రోజు ట్విట్టర్ లో తేజస్వి యాదవ్ పోస్టు చేసి అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అరేళ్ల క్రితం బీహర్ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చలేకపోయారని చెప్పారు.
ఆయన లేఖ సారంశం సాగిందిలా.. ఆరేళ్ల క్రితం బీహార్ ప్రజలకు ప్రధాని హోదాలో నరేంద్రమోడీ ఇచ్చిన హామీలు నాయకులు మార్చిపోయినా.. పాలకులు నెరవేర్చకపోయినా.. ప్రజలకు మాత్రం గుర్తున్నాయని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. బీహార్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారని, రాష్ట్రానికి రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారని... ఇంకా మరెన్నో హామీలను ఇచ్చినా.. ప్రధానంగా ప్రజలు ఈ రెండు హామీల గురించే అధికంగా అలోచిస్తున్నారని,. ఇవి సాకారమైన పక్షంలో తమ జీవితాల్లోకి వెలుగులు వస్తాయని బీహార్ వాసులు ఎదురుచూస్తున్నారని.. అవి ఏమయ్యాయని ప్రశ్నించారు. చట్టాల పేరుతో ఇంకెన్నేళ్లు బీహార్ కు ప్రత్యేక హోదాను తిరస్కరిస్తారని నిలదీశారు.
40 మంది రాష్ట్ర ఎంపీల్లో 39 మందిని మీకు అందించిన బీహార్ కోసం చట్టాలను మార్పు చేయలేరా? అని ప్రశ్నించారు. ఎన్నో అంశాలకు సంబంధించి చట్టాలను సవరణ చేసిన మీరు... ఈ అంశంలో మాత్రం ఆ పని చేయలేరా? అని అడిగారు. పాట్నా యూనివర్శిటీకి కేంద్ర హోదా కల్పిస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని తేజశ్వి విమర్శించారు. బీహార్ పై సవతి ప్రేమను చూపిస్తున్నారని మండిపడ్డారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా బీహార్ కూలీలను కేంద్రం చిన్న చూపు చూసిందని విమర్శించారు. విదేశాల్లోని ఎన్నారైలను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలను కేంద్రం ఏర్పాటు చేసిందని... ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మైళ్లు నడుస్తూ వచ్చిన బీహారీలను మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more