Durga Matha as Annapurna Devi at Indrakeeladri ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణదేవి అలంకరణలో కనకదుర్గమ్మ..

Durga devi atop indrakeeladri attired as annapurna devi on fourth day of dasara celebrations

Kanaka durgadevi Temple, dasara celebrations, Gayatri Devi. durga devi, Dasara celebrations at Durga temple , Indrakeeladri, Dasara celebrations, 9 days Dasara celebrations, dasara navaratri, COVID-19, Coronavirus, Indrakeeladri, Vijayawada, Andhra Pradesh, Alampur, jogulamba Temple, Shaktipeetam, Mahaboobnagar, Telangana

The nine-day Dasara celebrations have begun at the Durga temple on Indrakeelthe hillock, on the Fourth day of Navaratri celebrations today the Goddess Kanaka Durga attired as Annapurna Devi.

ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణదేవి అలంకరణలో కనకదుర్గమ్మ..

Posted: 10/20/2020 05:15 PM IST
Durga devi atop indrakeeladri attired as annapurna devi on fourth day of dasara celebrations

(Image source from: Sakshi.com)

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులు అత్యంత భక్తిప్రవర్తులతో పాల్గొంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ అంగరంగవైభవంగా నిర్వహిస్తోంది, దేవీ శరన్నవరాత్రులలో నాల్గవ రోజైన ఇవాళ అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శమిస్తున్నారు. సృష్టిలోని ప్రతీజీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి అన్నపూర్ణ. ఒక చేతిలో అక్షయ పాత్రతో, మరియొక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది. సాక్షాత్తూ పరమేశ్వరునికే భిక్షనొసంగిన అన్నపూర్ణ అక్షయ శుభాలను కలిగిస్తుంది. అన్నపూర్ణ దేవి అలంకరాంలోని అమ్మవారి దర్శించుకున్న భక్తులకు తమ గృహాలలో లేమి అన్న పదం వినపించదని, నిత్యం అన్నానికి లోటులేకుండా వుంటుందని భక్తులు విశ్వాసం.

అన్నపూర్ణ దేవి అవతారంలోని కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు వేకువ జామునుంచే ఆలయానికి చేరుకున్నారు. ఉత్సవాల నాల్గవ రోజు కావడంతో ఉదయం 3గంటలకు సుప్రభాత సేవతో ఆరంభించి నిత్యకైంకర్యాలను నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ముందుగా జారీ చేసిన టిక్కెట్లు ఉన్న వారిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నారు. వేలాది మంది పోలీసులు ఉత్సవాల భద్రతలో పాల్గొంటున్నారు. ప్రతి గంటకు వెయ్యి మంది భక్తులు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు దుర్గగుడి ఆలయ నిర్వహకులు.. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆర్జిత సేవలైన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీయాగాలను పరోక్ష భాగస్వామ్యంతో రుత్వికులు చేత నిర్వహిస్తున్నారు. 

సాక్షాత్‌ తన భర్త పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనికి వస్తే ఆ తల్లి అన్నపూర్ణాదేవిగా మారి ఆయనకు భిక్షని ప్రసాదిస్తుంది. అలాగే దుర్గమ్మ అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది. దీంతో ఇవాళ అన్నపూర్ణ దేవి అలంకారకృతురాలైన అమ్మవారిని భక్తులు ప్రసన్నం చేసుకునేందుకు ఇవాళ అన్నపూర్ణష్టక పారాయణం చేస్తే శుభదాయకం. ఇక కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఆలయ అధికారులు పలు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భక్తులకు వ్యాధులు ప్రబలకుండా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఆలయ కమిటీ చర్యలు తీసుకుంది, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles