తిరుపతి టీడీపీ నేతలను పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా గృహనిర్భంధంలో వుంచారు. కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ గరుడ సేవను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు వస్తున్నారు. దీంతో తిరుమల శ్రీవారి ఆలయ సంప్రదాయాలకు గౌరవమివ్వకుండా సీఎం జగన్ తిరుపతిలో పర్యటించడానికి వీల్లేదంటూ తిరుపతిలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో శ్రీవారి కోండపైకి సీఎం రాక సందర్భంగా తాను టీటీడీ పరిపాలన భవనం ఎదుట ధర్నాకు దిగుతానని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రకటించారు.
దీంతో అమె పిలుపును అందుకున్న టీటీడీ జిల్లా, తిరుపతి నగరం శాఖ కూడా సుగుణమ్మ ధర్నాలో భాగమయ్యేందుకు సిద్దమయ్యారు. అయితే టీటీడీ నేతల ధర్నాతో సీఎం పర్యటనలో ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ముఖ్యనేతల ఇళ్ల నుంచి బయటకు రాకుండా గృహనిర్భంధంలో వుంచారు. వీరితో పాటు అటు పలువురు బీజేపి నేతలను కూడా పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. అయినా పలువురు టీడీపీ నేతలు నగరంలోని తితిదే పరిపాలన భవనం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయం వద్ద ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. డిక్లరేషన్ పై సంతకం, దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీఎం స్పందించాలంటూనినాదాలు చేశారు.
జిల్లావ్యాప్తంగా పలువురు టీడీపీ సహా బీజేపి నేతలను పోలీసుల గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటుగా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహయాదవ్ తోపాటు బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్, జిల్లా కార్యదర్శి భాస్కర్, తిరుపతి నగర బీజేపి అధ్యక్షుడు వర ప్రసాద్ లతో పాటు పలువురు నాయకులను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ... తమ గొంతు వినిపించే కనీస హక్కు ఇవ్వకుండా ముఖ్యమంత్రి తమను గృహాల్లోనే బంధించడం సమంజసం కాదని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మండిపడ్డారు. సతీసమేతంగా ఇవ్వాల్సిన పట్టువస్త్రాలను సీఎం ఒక్కరే ఇవ్వటం రాష్ట్రానికి, దేశానికే అరిష్టమని తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఆలయ సంప్రదాయాలను గౌరవించకుండా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించటానికి సీఎం రావటం సరికాదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more