(Image source from: Manamnews.com)
మద్యానికి అలవాటు పడిన మందుబాబులు మద్యం కన్నా తక్కువ ధరకు లభించే సానిటైజర్లను సేవించి మత్తులో జోగడం.. దీంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. మద్యం ధరలను సవరించింది. పేదలు, బడుగులు సేవించూ చిన్నబ్రాండ్ల మద్యం ధరలను తగ్గించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.120 ఉన్న క్వార్టర్ మద్యం ధరపై రూ.30, హాఫ్ బాటిల్ పై రూ.60 తగ్గించింది. రూ.120 నుంచి రూ.150 వరకు ఉన్న బ్రాండ్ల ధరల్లోనూ క్వార్టర్ పై రూ.70మేర కుదించింది.
అయితే క్వార్టర్ మద్యం రూ.150 నుంచి రూ.190 వరకు ఉన్న బ్రాండ్లపై ధరల జోలికి వెళ్లని ప్రభుత్వం వాటిని యథాతథంగా ఉంచింది. ఇక అంతకుమించిన పెద్దబ్రాండ్ల ధరను కూడా అమాంతం పెంచేసింది. క్వార్టర్ రూ.190 నుంచి 210 వరకు ఉన్న బ్రాండ్లపై ఏకంగా రూ.70మేర పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. క్వార్టర్ రూ.210కి పైగా ఉన్న బ్రాండ్లపై ధరను కూడా పెంచింది. దీంతోపాటు అన్ని రకాల బీర్లపై రూ.30, రెడీ టు డ్రింక్ మద్యంపై రూ.30 తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇవాల్టి నుంచే ఈ ధరలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ప్రభుత్వం రేట్లను సవరించడంతో ఇక మందుబాబులు ఆనందం వవ్యక్తం చేస్తున్నారు.
కాగా పెద్ద బ్రాండ్లు సేవించే మందుబాబులు మాత్రం ఇలా ప్రభుత్వం తమపై భారం మోపడాన్ని కూడా అదే మందుతో కలసి స్నేహితులతో పంచుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు తక్కువ బ్రాండ్ విలువ ఉన్న మద్యం ధరలను తగ్గించాలంటూ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలుచోట్ల శానిటైజర్లు, మిథైల్ ఆల్కహాల్ తాగి కొంతమంది మృతిచెందడం, మద్యం అక్రమ రవాణా నేపథ్యంలో ఎస్ఈబీ పలు సూచనలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా తాజాగా కొన్ని రకాల మద్యంపై ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more