ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు ప్రజల్లో తమదైన ముద్ర వేసుకునేందుకు ప్రవేశపెడుతున్న పలు విధానాలు, పథకాలు వివాదాస్పదమై న్యాయస్థానాలో విచారణ సాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వం ప్రబుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన 81, 85 జీవోలను ఏపీ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కోరింది.
అయితే ఈ పిటీషన్ ను విచారణించిన న్యాయస్థానం రాష్ట్రోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విదింపుకు నిరాకరించింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తమ వినతిని తిరస్కరించడంతో ప్రభుత్వానికి మరోమారు ఎదురుదెబ్బ ఎదురైంది. ఏపీ ప్రభుత్వం తరపున కోయంబత్తూర్ కు చెందిన సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపించారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని విద్యాహక్కు చట్టంలో లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ ప్రగతిశీల నిర్ణయం తీసుకుందని వాదించారు. తెలుగులో బోధన వల్ల పాఠశాలల్లో నమోదు తగ్గిపోతోందని కోర్టుకు వివరించారు.
దీనిపై స్పందించిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ కెఎం జోసెఫ్ లతో కూడాని త్రిసభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని చెప్పింది. నోటీసులతో స్టే కూడా ఇవ్వాలని విశ్వనాథన్ ధర్మాసనాన్ని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియంలో బోధననే కోరుతున్నారని ఏపీ సర్కారు వాదించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. కేవియట్ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more