రాష్ట్రప్రభుత్వానికి ఇవాళ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వేల మందితో పాటు ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వేలాది మందికి ప్రభుత్వం భూములను కేటాయిస్తుందా.? అని ప్రశ్నించింది. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కారుచౌకగా సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులకు అప్పగించడం సహేతుకం కాదని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తెలంగాణ సర్కారుకు అక్షింతలు వేసింది. టాలీవుడ్ దర్శకుడు శంకర్ కు స్టూడియో నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. రూ.2.5కోట్ల విలువ చేసే భూమిని రూ.25లక్షలకు ఎలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలకపాత్ర పోషించారని అడ్వొకేట్ జనరల్ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమాధానం పట్ల హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది త్యాగాలు చేశారని... వారందరికీ ఇలాగే భూములిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదని.. మంత్రివర్గ నిర్ణయాలకు సహేతుకత ఉండాలని సూచించింది. ఇప్పటికే తెలంగాణలో రామోజీ ఫిల్మ్ సిటీ ఉండగా మరో ఫిల్మ్సిటీ అవసరమా? అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలకు ప్రభుత్వం గడువు కోరగా.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
(Video Source: NTV Telugu)
ఇక మరో కేసు విషయంలోనూ రాష్ట్రోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చివరకు దేవుడైనా చట్టానికి అతీతం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఖమ్మంలోని టీటీడీ కల్యాణ మండపం భూవివాదంపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. వీహెచ్పీ నేత అంజయ్య దాఖలు చేసిన పిల్ ను ధర్మాసనం విచారించింది. టీటీడీకి చెందిన 12 గుంటల భూమిని వెనక్కు తీసుకుంటున్నారని పిల్ లో పిటిషనర్ పేర్కొన్నారు. టీటీడీ ఆధీనంలో 12 గుంటల భూమి అదనంగా ఉందని ఖమ్మం కార్పొరేషన్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది.
కాగా, ఇవాళ కేసును విచారించిన న్యాయస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది, ప్రభుత్వ భూమినే టీటీడీ ఆక్రమించిందా.? అన్నట్లుగా అనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేవుడి పేరిట భూ ఆక్రమణ సరికాదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ క్రమంలో దేవుడు కూడా చట్టానికి అతీతం కాదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. భూదస్తావేజులు, పత్రాలు కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణ సెప్టెంబరు 8కి కోర్టు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more