(Image source from: Thehindu.com)
రాష్ట్రానికి చెందిన ఎన్నికల కమీషనర్ పదవిలో కొనసాగింపుపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు స్పష్టమైన అదేశాలను జారీ చేసినా.. రాష్ట్రప్రభుత్వం పదవీ బాధ్యతలను అప్పగించకుండా అడ్డుకుంటున్న తరుణంలో న్యాయస్థానం అదేశానుసారం ఆయన రాష్ట్ర గవర్నర్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి నియమించాలని అదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం... రమేశ్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ను ధర్మాసనం కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా న్యాయస్థానం అదేశాలను కూడా అమలుపర్చకుండా తనను పదవీ బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకుంటున్న రాష్ట్రప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్తానం సుప్రీంకోర్టులో మూడు సార్లు విచారణ జరిగినా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని రమేశ్ కుమార్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
అయినా.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయలేదని వివరించారు. ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తరపు న్యాయవాది అశ్వినీ కుమార్ న్యాయస్థానం దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు బాధ్యతలను ఎందుకని అప్పగించడం లేదని న్యాయస్థానం ప్రభుత్వం తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపింది. రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ ను కలిసి ఆయనకు వినతిపత్రం అందజేయాలని రమేశ్కుమార్కు సూచించింది.
దేశ సర్వోన్నత న్యాయస్థాం సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి మూడు సార్లు నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం.. గవర్నర్ను కలిసి హైకోర్టు తీర్పు ప్రకారం తనను ఎస్ఈసీగా నియమించాలని కోరాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రమేశ్ కుమార్ సోమవారం గవర్నర్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్ఈసీగా తనను నియమించాలని కోరారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more