తెలుగు రాష్ట్రాలలో మళ్లీ మావోయిస్టులు తమ ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారా.? అందుకు అనుగూణంగా తమ క్యాడర్ ను పెంచుకుంటున్నారా.? క్యాడర్ పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాలనే వారు ఎంచుకున్నారా.? అన్న ప్రశ్నలు తాజాగా ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోతే ఈ సమస్య ఉత్పన్నం అవుతుందని అప్పటి నేతలు చెప్పినా.. ఈ రెండు రాష్ట్రాలు ఏకంగా మావో రహిత రాష్ట్రాలుగా ఉత్భవించాయి. అయితే తాజాగా మావోయిస్టులు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మొన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలం మాంగీ అటవీ ప్రాంతంలో పోలీసులు, బహిష్కృత సిపీఐ(మావోయిస్ట్) సభ్యులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ మన్యం ప్రాంతాల్లో మావోలు టార్గెట్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా వున్న ఏజెన్సీ ప్రాంతాల్లో కాల్పుల మోతతో దద్దరిల్లాయి. మన్యంలోని ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్ద కాలం క్రితం విన్న కాల్పులు మోతలు మళ్లీ ఒక్కసారిగా వినిపించేసరికి అక్కడంతా బీతావాహ వాతావరణ అలుముకుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ జిల్లాలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆదివారం భీకరంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న బలగాలు.. ఆదివారం సాయంత్రం రెక్కీ నిర్వహించాయి. ఆ సమయంలోనే లండులు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారస పడటంతో పోలీసులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత సమయం పాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వర్గాలు ప్రకటించాయి. అయితే సంఘటనా స్థలంలో మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రి లభించినట్లు తెలుస్తోంది. కాగా, గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలను మావోయిస్టు పార్టీ వేగవంతం చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలోని ఆదిలాబాద్, అసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలపాలపై పోలీసులు బలగాలు నిఘా పెట్టాయి. అలాగే ఏపీలో సైతం ఎప్పటికప్పుడు మవోల కదలికలపై నిఘా ఉంచారు. గత వారంలో తెలంగాణలోనూ మావోలు తప్పించుకున్నారు. అసిఫాబాద్ మండలంలోని తుక్కుగూడ గ్రామంలో కూంబింగ్ చేస్తున్న పోలీసుల ప్రత్యేక బృందాలకు మావోయిస్టులు తారసపడ్డారు, దీంతో ఇరువర్గాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులకు తారసపడిన ముగ్గురు మావోయిస్టులు తప్పించుకునే క్రమంలో పోలీసులపైకి కాల్పులు జరిపారని పోలీసు వర్గాల సమాచారం. కాగా మావోలకు పోలీసు బలగాలు కూడా ధీటుగానే సమాధానమిచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more