అత్యాచార నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టకుండా వుండేందుకు ఏకంగా రూ.35 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఓ మహిళా ఎస్ఐ అడ్డంగా బుకయ్యింది. అత్యాచార కేసులో నిందితుడిపై కేసు నమోదు కాగానే రూ.20 లక్షల డబ్బును పోందిన తరువాత కూడా అతడి తమ్ముడిని బెదిరించి.. పూర్తి డబ్బును డిమాండ్ చేసిన కిలాడి మహిళా ఎస్ఐని అహ్మాదాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మహిళగా వుంటూ మహిళలపై అత్యాచారం చేశాడన్న అభియోగాల నేపథ్యంలో బాధిత మహిళలకు న్యాయం చేయాల్సిన ఎస్ఐ అన్యాయంగా నిందితులకు న్యాయాన్ని అమ్మేందుకు పెట్టిన ఎస్ఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళా ఎస్ఐను అరెస్టు చేయడంపై బాధితులతో పాటు మహిళా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. డబ్బు కోసం మాన, ప్రాణాలను కూడా అమ్ముకునే నీతి లేని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడిపై సంఘ వ్యతిరేక కార్యకాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఆమె లంచం డిమాండ్ చేసారని ఆరోపణలు వచ్చాయి. అసలేం జరిగిందంటే అహ్మాదాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసే ఇద్దరు మహిళలు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనాల్ షా తమపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసు నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. కాగా, ఇటీవల ఈ కేసు విచారణ అహ్మదాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తోన్న శ్వేతా జడేజాకు అప్పగించారు.
కేసు విచారణ ప్రారంభించిన శ్వేత.. నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిందితుడి సోదరుడు భావేష్ను హెచ్చరించారు. భావేష్ ఓ మధ్యవర్తి ద్వారా 20లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని, అ మొత్తాన్ని అప్పజెప్పాడు. కొద్ది రోజుల తర్వాత మరో 15లక్షలు ఇవ్వాలని ఎస్ఐ నుంచి ఒత్తిడి రావడంతో సిటీ క్రైమ్ పోలీసులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి శ్వేతను అరెస్ట్ చేశారు. రూ.20లక్షల లంచం తీసుకుని, మరో 15లక్షలు డిమాండ్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఈ మొత్తం కేసు దర్యాప్తును స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏసీపీ బీసీ సోలంకికి అప్పగించినట్లు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ అజయ్ తోమర్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more