Jagannath Rath Yatra Without Devotees In A Historic First కదిలిన జగన్నాథ రథాలు.. కానరాని భక్తజన సందోహం

Chariots of lord jagannath lord balabhadra devi subhadra reach gundicha temple

rath yatra live, rath yatra 2020, rath yatra puri 2020, jagannath rath yatra, jagannath, rath yatra 2020 news, supreme court, rath yatra today, puri rath yatra, happy rath yatra 2020, rathayatra, rath yatra 2020 date, happy rath yatra, jagannath photo, rath yatra latest news, rathyatra, ratha yatra puri 2020, jagannath puri, puri, rath yatra date 2020, jagannath image, jagannath rath yatra 2020, jay jagannath, jai jagannath, happy rath yatra image, ratha yatra, shri jagannath temple puri, puri, odisha

The annual lord Jagannath Yatra in Puri has started today. Idols of Lord Jagannath, Balbhadra and Subhadra are moved out of Jagannath temple and were seated on chariots. The chariots are moved by 'sevayats' on the 'Bada Danda' road in Puri towards the Gundicha Temple.

ITEMVIDEOS: చరిత్రలో తొలిసారి: కదిలిన జగన్నాథ రథాలు.. కానరాని భక్తజన సందోహం

Posted: 06/23/2020 09:14 PM IST
Chariots of lord jagannath lord balabhadra devi subhadra reach gundicha temple

ప్రముఖ శ్రీ క్షేత్రం పూరీలోని జగన్నాథుడి రథయాత్ర రథచక్రాలు ప్రతీఏడు మాదిరిగానే ఈ సారి కూడా కదిలాయి. అయితే చారిత్రక నేపథ్యం ఇమిడివుండటంతో ప్రతీ సంవత్సరం పూరికి కదిలివచ్చే లక్షలాది మంది భక్తజన సందోహ మధ్య సాగే రధయాత్ర.. చరిత్రలో తొలిసారిగా భక్తజన సందోహం లేకుండా మంగళవారం అంగరంగ వైభవంగా సాగాల్సిన ఉత్సవాలు నిరాడంబరంగా సాగాయి, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలతో భక్తులను అనుమతించకుండా రథయాత్రను కొనసాగించారు. ఒక్కో రథానికి 500 మంది చొప్పున మూడు రథాలను లాగడానికి కేవలం 1,500 మందిని మాత్రమే అనుమతించారు. వీరికి కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాతే యాత్రలో పాల్గొనడానికి అనుమతించడం విశేషం.

అయితే ఈ రధోత్సవాలు ఆద్యంతం కన్నుల పండువగా సాగాయి. తొలుత ఆలయంలో జగన్నాథ స్వామికి కంకైర్యాలు నిర్వహించి, జగన్నాథ, సుభద్ర, బలభద్ర దేవతా మూర్తులను సర్వాంగ సుందరంగా అలకరించి రథాలపై ప్రతిష్టించారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య... స్వామి సేవలో ఉండే ‘సేవాయత్‌’లే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతకు ముందు సంప్రదాయం ప్రకారం పూరీ రాజు బంగారు చీపురు పట్టుకుని రథాల ముందు ఊడ్చి, స్వామికి సేవలు నిర్వహించారు. భక్తులు పాల్గొనకుండా కేవలం ఏడు రోజుల పాటు మాత్రమే రథయాత్ర నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో చరిత్రలోనే తొలిసారిగా రథయాత్రలో కేవలం పూజారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. అయితే, భక్తులు వీక్షించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేస్తున్నారు.

మరోవైపు, భక్తుల రాకను నిలువరించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజా రవాణా, ఇతర సౌకర్యాలను ఒడిశా ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే, సోమవారం రాత్రి 9.00 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 2.00 గంటల వరకు పూరీ నగరంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉత్తర్వులు అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగంణంలో శానిటైజేషన్‌ ప్రక్రియను చేపట్టారు. సూరత్‌లోని జహంగీర్ పూర ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ మందిరంలో రథయాత్రను కేవలం ఆలయ పరిసరాల్లోనే నిర్వహించారు. అతి కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ తర్వాత సూరత్ ఇస్కాన్ ఆలయంలోనే అత్యంత వైభవంగా రథయాత్ర నిర్వహిస్తారు. కానీ, ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఆంక్షలు కొనసాగడంతో యాత్రకు అనుమతించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagannath temple  rath yatra 2020  coronavirus  covid-19  supreme court  Puri  Odisha  

Other Articles