ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీపడకుండా.. ఆలయ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రభుత్వం కోఆర్డినేషన్ చేసుకొని రథయాత్రను నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. పలు ఆంక్షల నడుమ రథయాత్ర జరపాలన్న సుప్రీంకోర్టు... ఒకవేళ పరిస్థితి చేదాటిపోతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, యాత్రను నిలిపివేయవచ్చని సూచించింది. ఇక రథయాత్ర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఒడిశా తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే సుప్రీంకోర్టుకు తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యంలో రథయాత్రపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సమీక్ష నిర్వహించారు.
పూరీలో జూన్ 23 నుంచి రథయాత్ర జరగనుంది. ప్రతి ఏటా 10-12 రోజుల పాటు జగన్నాథుడి రథయాత్రను కన్నుల పండవగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొని పులకించిపోతారు. కానీ ఈసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యాత్రను నిలిపివేయాలని కొందరు పిల్ వేశారు. దానిపై విచారించిన సుప్రీంకోర్టు రథయాత్రను నిర్వహించకూడదని జూన్ 18న స్పష్టం చేసింది. ప్రజలకు ఏమైనా జరిగితే ఆ దేవుడు మనల్ని క్షమించడని తెలిపింది. ఐతే ఈ తీర్పును పున: పరిశీలించాలని దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు.. సోమవారం రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జగన్నాథుడి రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు విధించిన షరతులకు లోబడే రధయాత్రను నిర్వహించాలని తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటు రాష్ట్ర అధికారులతో పాటు అటు ఆలయ సభ్యులతోనూ సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సంబంధించిన అధికారులతో పాటు ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించింది. నకాగా, ఒడిశా వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఆదివారం రాష్ట్రంలో 304 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు చనిపోయారు. ఒడిశాలో ఇప్పటి వరకు 5,160 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 3,534 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 14 మంది మరణించారు. ప్రస్తుతం ఒడిశాలో 1,607 యాక్టివ్ కేసులున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more