దేశంలో కరోనా ప్రభావితం బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ వైరస్ ను పలు ప్రైవేటు అసుపత్రులు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రైవేటు అసుపత్రులకు ధరలను నిర్ణయించింది. కరోనా బారినపడిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు ఓ వైపు పోరుగున్న తెలుగు రాష్ట్రంలోని ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ. 2900లను నిర్ణయించగా, మహారాష్ట్ర మాత్రం కేవలం రూ.2200లను నిర్ణయించింది. దీంతో మహరాష్ట్ర బాటలోనే పయనించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనూ ప్రైవేటు ల్యాబుల్లో కరోనా నిర్వహణ చేపట్టేందుకు అనుమతులను ఇచ్చింది.
అంతేకాదు పలు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కరోనా వైరస్ చికిత్స చేసేందుకు అనుమతులు మంజూరు చేసిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నగరంలోని కరోనా కమాండ్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులతో కలసి రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన ఆనంతర ఈ విషయమై మీడియాతో మాట్లాడిన ఆయన కరోనాపై నిత్యం ఉన్నతస్థాయి సమీక్ష చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఐసీఎంఆర్ ప్రశంసించిందని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో సామూహ వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ తెలిపిందని చెప్పారు. ఐసీఎంఆర్ నిబంధనలు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుందని అన్నారు. రాస్ట్రంలో యాభై వేల పరీక్షలు నిర్వహించాలని తాజా అదేశాల నేపథ్యంలోనూ.. కేవలం కరోనా లక్షణాలు వున్నవారికి మాత్రమే పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. ఐసీఎంఆర్ తమకు ఈ మేరకు నిబంధనలు జారీ చేసిందని చెప్పారు, లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయడం లేదన్నారు. కరోనా లక్షణాలు లేని వాళ్లు తప్పకుండా హోం ఐసోలేషన్ పాటించాలని మంత్రి కోరారు. కాగా ప్రభుత్వ చర్యల వల్లే రాష్ట్రంలో కేసులు ఎక్కువగా రావడం లేదని వివరించారు.
* ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర : రూ.2,200
* సాధారణ చికిత్సకు రోజుకు రూ.4 వేలు
* వెంటిలేటర్పై లేకుండా ఐసీయూలో ఉంచితే రోజుకు రూ.7,500
* వెంటిలేటర్పై ఉంటే రోజుకు రూ.9 వేలు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more