Coronavirus highest spike in Telangana with 206 cases తెలంగాణలో ఒక్కరోజు 206 కేసులు.. 10 మరణాలు

Covid 19 update coronavirus highest spike in telangana tally nears 3500 mark

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

The death toll due to Covid-19 in Telangana crossed 100 with six more persons succumbing to the deadly virus. Ten deaths during the last 24 hours ending Saturday 9 p.m. pushed the death toll to 105. Telangana became the ninth state in India to record more than 100 deaths due to Covid-19.

తెలంగాణలో బుసకొడుతున్న కరోనా.. ఒక్కరోజు 206 కేసులు.. 10 మరణాలు

Posted: 06/06/2020 11:11 PM IST
Covid 19 update coronavirus highest spike in telangana tally nears 3500 mark

(Image source from: Economictimes.indiatimes.com)

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు అందోళన కలిగిస్తున్నాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణవాసులను ఎంతో కలవరానికి గురిచేస్తున్న మరణాలు ప్రతీ రోజు రాష్ట్రంలో సంభవిస్తుండడం అందోళన కలిగిస్తోంది. తాజాగా నమోదైన మరణాలతో తెలంగాణ.. ఒక్క రోజులో పది మరణాలు చోటుచేసుకున్న రాష్ట్రంగా కూడా నిలిచింది. ఇదివరకు దేశంలో వందకుపైగా మరణాలు నమోదు చేసుకున్న తొమ్మిదవ రాష్ట్రంగా నిలిచింది. దీంతో అటు ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గినా.. మళ్లీ పెరుగుతున్న కేసులు, మరణాలు రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.

ఈ ఏప్రిల్ మాసంలో గణనీయంగా తగ్గిన కేసులు మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా ఈ నెలలో రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ రమారమి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. గ్రేటఱ్ పరిధిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నగరం చుట్టూరా కరోనా మహమ్మారి మాటు వేయడం అందోళన రేపుతోంది. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకున్నా.. వ్యాప్తి మాత్రం అగడం లేదు. ఇవాళ తాజాగా నమోదైన కేసులలోనూ అత్యధిక కేసులు గ్రేటర్ కు పరిధిలోనివే కావడం గమనార్హం. దీంతో పాటు గత వారం రో్జులుగా తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

ఫలితంగా తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులతో కలిపి మొత్తంగా మూడు వేల మార్కును అధిగమించాయి, దీంతో దేశంలో మూడు వేలకు పైగా కరోనా కేసుల నమోదు చేసుకున్న 12వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తాజాగా రాష్ట్రంలో 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇదివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ గ్రేటర్ పరిధిలో ఏకంగా 152 కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో పది, మేడ్చల్ జిల్లాలో 18, యాదాద్రి జిల్లాలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇటు నిర్మల్ జిల్లాలో ఐదు, మహబూబ్ నగర్ జిల్లాలో 4, జగిత్యాల, నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు చోప్పున, మహబూబాబాద్, వికారాబాద్, జనగామ, గద్వాల, నల్గోండ, భద్రాధ్రి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో ఒక్కటి చోప్పున కరోనా కేసులు నమెదు అయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులు మొత్తంగా 3500 మార్కుకు చేరువలో వుంది. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులెవరికీ కరోనా పాజిటివ్ నిర్థారణ కాలేదని, అన్ని రాష్ట్రానికి చెందిన వారివేనని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో పది మంది కరోనా బారిన పడి అసువుల బాసారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 123కి చేరింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా పెరుగుతుండటం అందోళనకర పరిణమం.

తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 206 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 3496 కేసులు నమోదయ్యాయి, ఇక ఇవాళ రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా అధికంగానే సంభవించాయి, ఇవాళ ఏకంగా నలుగురు కరోనా బారిన పడి చికిత్స పోందుతూ అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 123కు చేరింది. కరోనా బారినపడిన బాధితులు కోలుకొని మొత్తంగా 1716 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1663 యాక్టివ్‌ కేసులు వున్నాయని వారంతా గాంధీ అసుపత్రిలో చికిత్స పోందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక వీరిలో 3048 మంది రాష్ట్రావాసులు కాగా, 448 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని ఆరోగ్యశాఖ పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles