ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికారుల తీరుపై అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే అసంతృప్తి గళం వినిపించారు. రాష్ట్రంలో ఏడాది పాలన పూరైన సందర్భంగా కేకులు కట్ అవుతున్నాయని, అయితే ఆ మేరకు కనీస ‘అభివృద్ధి మాతరం జరగడం లేదని అసంతృప్తిని వెళ్లగక్కారు. అభివృద్ది పనులపై తాను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వివరించి లేఖ రాశానని, వాటిని పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించినా.. ఇప్పటికీ వాటిపై ఎలాంటి స్పందన లేదని.. అసలు తాను రాసిన లేఖ ఎక్కడుందో కూడా తెలియదని మాజీ మంత్రి, వెంకటగిరి వైసీపి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
అధికారుల తీరులో ఇప్పటికైనా మార్పు రావాలని సూచించిన ఆయన.. అలా రానీ పక్షంలో తానే అధికారగణానికి వ్యతిరేకంగా దీక్షకు కూర్చుంటానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిపై లేఖలు, నివేదికలు ఇవ్వడానికే తాను ఏడాది సమయాన్ని కేటాయించానని.. ఇకపై వీటన్నింటినీ పరిష్కారించేందుకు ముందుకు కదలుతానని అన్నారు. అవసరమైతే అధికారులను ఎక్కడికక్కడ నిలదీయడానికి కూడా తాను వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలోని తన నియోజకవర్గంలో రామనారాయణరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రాక ముందే 100 పడకల ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం, ట్రామా కేర్ సెంటర్లు, ఆసుపత్రులు నిర్మించాలని డిమాండ్ చేశారు.
తన నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరినా అధికారుల నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదని అన్నారు. సీఎం ప్రకటించే సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారా ప్రజలకు చేరుతున్నాయి తప్ప.. నేరుగా నియోజకవర్గానికి ఒక్క రూపాయి తీసుకువచ్చి అభివృద్ధి చేయలేకపోయానని ఆయన అవేధన వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమం అవసరమే.. అయితే నియోజక అభివృద్ది అన్నది సమిష్టి అవసరం అని అన్నారు. తమ నియోజకవర్గంలోని వెంకటగిరి మున్సిపాలిటీలో రోడ్డు, కాలువ, శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి తాను స్వయంగా ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చినా.. ఇప్పటికీ ఒక్క రూపాయి మంజూరు కాలేదని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more