ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభంతో కాసింత వేగాన్ని తగ్గించుకున్న కరోనా వ్యాప్తి.. మళ్లీ నలబైకి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక అంతకుముందు వారం పది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. తాజాగా రాష్ట్రంలో నలభై మార్కుకు పైబడి కరోనా కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది.ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 48 కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది.
తాజాగా నమోదైన 48 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2700 మార్కును దాటింది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 2719కి చేరింది. కాగా రాష్ట్రంలో తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో మరో వ్యక్తి కరోనా బారినపడి చికిత్స పోందుతూ మరణించాడు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య కూడా 57కు చేరింది. అయితే కరోనా వైరస్ బారినపడిన పడి కోలుకున్నవారిలో తాజాగా 55 మందిని ఇవాళ అధికారులు డిశ్చార్చ్ చేశారు.
రాష్ట్రంలో కొత్తగా నమదైన పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీరు తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ తో సంబంధమున్న వారేనని వైద్యాధికారులు తెలిపారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరోనావైరస్ వ్యాప్తికి హాట్ స్పాట్లుగా వున్నాయి. కాగా వివిద ఆసుపత్రుల్లో 759 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా 55 మంది వ్యాధి నుంచి కోలుకుని ఢిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి కొలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1903కు చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more