ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతోనే అందోళన చెందుతున్న రాష్ట్ర ప్రజలకు మరో పిడుగులాంటి వార్త కలవరపాటుకు గురచేస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ స్టేట్ 3కి వెళ్లిందని.. దీంతో కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా జరుగుతుందన్న వార్తతో ప్రజలు భాయందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం సామాజిక వ్యాప్తి ప్రాథమిక స్థాయిలో ఉందని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.
రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్ టెస్ట్లు చేసేందుకు సంకల్పించామని, దీంతో కమ్యూనిటీ వ్యాప్తిపై అవగాహన వస్తుందని ఆయన తెలిపారు. ఇక ఈ నెల 14 తర్వాత లాక్ డౌన్ ను కేంద్రం ఎత్తివేసినా.. రాష్ట్రంలో మాత్రం పూర్తిగా ఎత్తేయడం కుదరదని చెప్పారు. విజయవాడ, గుంటూరు లాంటి హాట్ స్పాట్ లలో ఆంక్షలు కొనసాగుతాయని జవహర్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొవిడ్ లక్షణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు ప్రత్యేకసర్వే చేశామన్నారు. 5వేల మందిని గుర్తించామని చెప్పారు. వారిలో 1800-2000 మందికి పరీక్షలు అవసరమని గుర్తించామన్నారు
కమ్యూనిటీ పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్ లనూ సంప్రదిస్తున్నామన్నారు. వీటితో పాటు టీబీ పరీక్షలు చేసే ట్రూనాట్ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయొచ్చని ఐసీఎంఆర్ చెప్పిందని అన్న జవహార్ రెడ్డి.. ఇందుకోసం 240 ట్రూనాట్ సెంటర్లును కూడా వినియోగించనున్నామన్నారు, 20 లక్షల పీపీఈలు, 14 లక్షల ఎన్-95 మాస్క్లు సిద్ధం చేస్తున్నాం. 40లక్షల గ్లోవ్స్, 12 లక్షల సర్జికల్ మాస్క్లు ఉన్నాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు 20 లక్షలు, అజిత్రోమైసిన్ 14 లక్షలు సిద్ధంగా ఉంచామన్నారు. ఈ కాంట్రాక్టు, ఔట్ సోర్పింగ్ విధానంలో ప్రస్తుతం సేవలు అందిస్తున్న వారికి భవిష్యత్తులో జరిగే ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more