తన అభిమానులకే కాదు ప్రజలెవరికి కష్టం వచ్చినా.. అందులోనూ మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ఇబ్బందులను ఎదుర్కొన్నా.. తనవారంటూ వారిని కష్టాల కడలి నుంచి దాటించేందుకు తనవంతుగా సాయం చేయడానికి ముందుకు వచ్చే సినీనటుడు.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహహ్మారి నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూనే తన వంతు సాయంగా ఏకంగా రెండు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కోంటున్న ఈ మహమ్మారిని పారద్రోలేందుకు.. ప్రధాని సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తనవంతు భాగస్వామ్యం కోసం ఈ నిధులు అందజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 21 వేల మందిని ప్రాణాలను బలితీసుకున్న ఈ మహమ్మారిని దేశంలో నియంత్రించేందుకు పవన్ కల్యాణ్ కాసేపటికే ప్రధాని సహాయ నిధికి కూడా రూ.కోటి విరాళం ప్రకటించారు. ‘ఈ కష్టకాలంలో ప్రధాని మోదీకి బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆయన నాయకత్వం, స్ఫూర్తిదాయక చర్యలు ఈ కష్టం నుంచి దేశాన్ని గట్టెక్కించగలవని నమ్ముతున్నా’ అంటూ ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ వ్యాపించకుండా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని, నిత్యమూ పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ డబ్బులను డొనేట్ చేస్తున్నానని, కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ డబ్బులను వెచ్చించాలని పవన్ కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more