ప్రపంచంలోని అన్ని ఖండాలకు విస్తరించి ఏకంగా 110 దేశాలకు విస్తరించిన కోవిడ్-19 (కరోనా వైరస్).. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలను కబళించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షమందికిపైగా ప్రజలను దాని ప్రభావం భారిన పడేట్లు చేసిన కరోనావైరస్ ను ప్రపంచ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చైనాలో వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్.. ఇప్పుడు చైనాపై పట్టు తప్పడం సంతోషకరం. అయితే చైనాను వదిలిన కోవిడ్ -19 ప్రస్తుతం ఇటలీ, ఇరాన్, కువైట్, ఇజ్రాయిల్ సహా అమెరికా, ఐరోపా తదితర దేశాల్లోకి చోచ్చుకెళ్లింది.
తొలి మరణాలు సంభవించిన తరువాత కూడా... కరోనాను ప్రపంచ వ్యాధిగా గుర్తించేందుకు నిరాకరించిన డబ్ల్యూహెచ్ఓ, ఇప్పుడు మనసు మార్చుకుంది. "కరోనా వైరస్ ఎంత శరవేగంగా విస్తరిస్తూ, ప్రమాద ఘంటికలను మోగిస్తున్నదో పరిశీలించిన తరువాత, కోవిడ్-19ను మహమ్మారిగా గుర్తిస్తున్నాం" అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టీడ్రాస్ అధానోమ్ మీడియాకు వెల్లడించారు. గత డిసెంబర్ లో చైనాలో తొలిసారిగా కనిపించిన ఈ వైరస్, ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించి, ప్రజల ప్రాణాలను బలిగొనడంతో పాటు ఆర్థిక వృద్ధికీ విఘాతం కలిగించింది.
వేలాది విమాన సర్వీసులు నిలిచిపోగా, ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలు, తమ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. పాఠశాలలు మూతపడగా, పలు కీలక ఈవెంట్లు వాయిదా పడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని సైతం ప్రకటిస్తున్నట్టు ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఇప్పటివరకూ 4,291 మంది మరణించారని టీడ్రాస్ వ్యాఖ్యానించారు. ఈ వైరస్ మహమ్మారేనని చెప్పడానికి ఇంతకన్నా మరే నిదర్శనాలూ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 2009లో హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ)ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన తరువాత, డబ్ల్యూహెచ్ఓ మరో వ్యాధిని ఇంత తీవ్రంగా పరిగణించడం ఇదే తొలిసారి.
భారత్ లో మరో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు..
తమ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్టు ప్రముఖ ఐటీ సంస్థలు డెల్ ఇండియా, మైండ్ట్రీ కంపెనీలు ప్రకటించాయి. వీరిని క్వారెంటైన్ చేసి, అత్యుత్తమ వైద్య సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపాయి. డెల్ ఉద్యోగి అమెరికాలోని టెక్సాస్ నుంచి రాగా, మైండ్ ట్రీ ఉద్యోగి కూడా విదేశాలకు వెళ్లి వచ్చారు. దీంతో వీరికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో రిపోర్టులు పాజిటివ్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన కంపెనీలు వారికి అత్యుత్తమ వైద్య సాయం అందిస్తున్నాయి. కాగా, యాక్సెంచర్ సంస్థ పూణె కార్యాయలంలోని ఒక అంతస్తును తాత్కాలికంగా మూసివేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more