HC serious on mishandling Babu in Vizag చంద్రబాబుపై సెక్షన్ 151 ఎలా ప్రయోగిస్తారు?: హైకోర్టు

High court serious on mishandling chandrababu naidu in visakhapatnam

CM Jagan, AP CM YS Jagan, YS Jagan on Chandrababu, chandrababu Praja Chaitanya Yatra, TDP Praja Chaitanya Yatra, chandrababu visakhapatnam, Praja Chaitanya Yatra Visakhapatna, YCP party, TDP party, Visakha airport, Praja Chaitanya Yatra, vizag, Visakhapatnam, Andhra Pradesh, Politics

TDP chief Chandrababu has been arrested by Visakhapatnam police on Thursday under section 151 in view of security measures. The police have taken him to the airport after a much struggle with the protesters. It remains to be seen whether Naidu flees to either Hyderabad or Vijayawada.

చంద్రబాబును.. ఈ నోటీసుతో ఎలా అరెస్ట్ చేశారు.?: హైకోర్టు

Posted: 02/28/2020 05:02 PM IST
High court serious on mishandling chandrababu naidu in visakhapatnam

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉతన్నమైన పరిణామాలకు పోలీసుల నిర్లక్ష్యం కూడా తోడందైన్న విమర్శలు వినిపించాయి. సుమారు మూడున్నర గంటల పాటు కారులోనే కూర్చున్నా.. పోలీసులు అధికార వైసీపీ పార్టీ కార్యకర్తలను చెదరగొట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ నేతలు విమర్శించారు.
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం ఉదయం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబును.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న పరిణామాలపై ఇవాళ రాష్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో విచారణ జరిగింది.

విశాఖ విమానాశ్రయం బయట వైసీపీ కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్ లంచ్ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఇరు పక్షాల వాదనలను ఆలకించింది. సెక్షన్‌ 151 కింద చంద్రబాబుకు డీసీపీ స్థాయి అధికారితో నోటీసు ఇప్పించి ఆయన్ను ముందస్తు అరెస్ట్‌ చేశారని శ్రావణ్‌ కుమార్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. సెక్షన్‌ 151 కింద రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసు ఇవ్వడాన్ని తప్పుబట్టారు.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ స్పందిస్తూ చంద్రబాబు భద్రత దృష్ట్యా నోటీసు ఇచ్చి ముందస్తుగా అరెస్ట్‌ చేశామని న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తి నేరం చేయకుండా ఉండేందుకు, అతన్ని అదుపు చేసేందుకు 151 సెక్షన్‌ను ఉపయోగించాలని.. నోటీసు ఇచ్చిన ప్రకారం చూస్తే ఈ కేసు వ్యవహారం అలా లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు సెక్షన్‌ 151 కింద ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నట్లు నోటీసు ఎలా ఇచ్చారని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని డీజీపీతో పాటు విశాఖ పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles