తెలంగాణ పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నిజామాబాద్ జిల్లాలో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు (స్పైసెస్ రీజినల్ ఎక్స్టెన్షన్ సెంటర్) కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం అక్కడున్న డివిజినల్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి పెంచనున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు.
పసుపు, మిరప పంటను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. ఐఏఎస్ హోదా డైరెక్టర్ స్థాయి అధికారి ఈ ప్రాంతీయ కార్యాలయంలో కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు గోయల్ తెలిపారు. ఈ ప్రాంతీయ కార్యాలయం నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదిస్తుందని వెల్లడించారు. సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ఏర్పాటుతో పసుపుతో పాటు మిరప ఇతర పంటలకు కూడా ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు.
పసుపు బోర్డు ఏర్పాటు అంటే కేవలం పసుపుకు మాత్రమే కాకుండా అంతకుమించి రైతులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరవతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సెంటర్ తో నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పసుపు, మిరప రైతులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఈ బోర్డు ఏర్పాటు నిమిత్తం అధికారిక ప్రకటన చేసిన ఆయన త్వరలోనే ఈ మేరకు నోటిఫికేషన్ సహా అన్నింటినీ కేంద్రం విడుదల చేస్తోందని అన్నారు.
పసుపు బోర్డు, మద్దతు ధర కోసం నిజామాబాద్ రైతులు చాలా కాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 175 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి సవాలు విసిరారు. దీంతో ఈ అంశం దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం కేరళలో స్పైసెస్ బోర్డు కార్యాలయం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని పసుపు రైతుల కోసం దీనికి అదనంగా రీజినల్ ఎక్స్ టెన్షన్ కేంద్రాన్ని నిజామాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు. పసుపు పంట నాణ్యత, మద్దతు ధర తదితర విషయాలను రీజినల్ బోర్డు పర్యవేక్షించనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more