తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో అదిలాబాద్ ప్రత్యేక ఫాస్ట్రాక్ న్యాయస్థానం ఇవాళ సంచలన తీర్పును వెలువరిచింది. సమత అత్యాచారం హత్య కేసులోని ముగ్గురు దోషులకు కోర్టు మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఆదిలాబాద్ ఫాస్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కోన్న నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్ లను దోషులుగా నిర్థారించిన న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది.దోషులు చేసిన నేరం ఘోరమైందిగా తీర్పు సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
సమత అత్యాచారం హత్య కేసు తీర్పును వెలువరించే సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘‘మీపై నేరం రుజువైందని, కోర్టుకు ఏమైనా చెప్పుకొనేది ఉందా’’ అని నిందితులకు అడిగారు. దీనిపై స్పందించిన ప్రధాన నిందితుడు షేక్ బాబు.. తనకు ప్రాణభిక్ష పెట్టాలని, కంటతడి పెడుతూ న్యాయమూర్తిని వేడుకున్నాడు. మిగతా నిందితులు కూడా ఇదే కోరారు. తమకు చిన్న పిల్లలున్నారని, కుటుంబానికి పెద్ద దిక్కు తామేనని వాపోయారు. కాబట్టి తమను వదిలేయాలని నిందితులు న్యాయమూర్తిని వేడుకున్నారు.
నిజానికి ఈ కేసులో తీర్పు ఈ నెల 27న వెల్లడి కావాల్సి ఉన్నా, న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో తీర్పును నేటికి వాయిదా వేశారు. కుమరం భీం జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్లో నవంబర్ 24న.. షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్లు సమతను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసు విచారణకు డిసెంబర్ 11న ఆదిలాబాద్లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు, పోలీసు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ వైద్యులు మొత్తం 25 మంది సాక్షులను కోర్టు విచారణ జరిపింది. డిసెంబర్ 31న కోర్టు విచారణ పూర్తి చేసింది. ఈ నెల 20తో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్ల మధ్య వాదనలు ముగిశాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more