రాష్ట్ర భవిష్యత్ కోసం తమ భూములను త్యాజించిన రైతులకు అండగా నిలబడిన వారిపై అధికార పార్టీకి చెందినవారు అసత్య ప్రచారం చేసి తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్న నేపథ్యంలో అలాంటివారిపై న్యాయసమయం చేసేందుకు సిద్దమయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమరావతి రైతులకు అండగా నిలుస్తానని చెప్పడం.. వారితో కలసి పోరాటాలు చేయడంతో జీర్ణించుకోలేని పలు శక్తులు ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నాయని దీంతో వారిపై న్యాయపరమైన సమరశంఖాన్ని పూరించనున్నామని జనసేన వార్గాలు తెలిపాయి.
రైతుగా రైతుల కష్టాలు తెలిసి.. మూడు పంటలు పండించే రైతన్న తన వ్యవసాయం కన్నా రాష్ట్రానికి రాజధాని ముఖ్యమని భూములను అప్పగిస్తే.. వారికి అండగా నిలచి.. వారి తరపున పోరాడుతానని పిలుపు ఇవ్వడంతో పవన్ కల్యాణ్ పైనే పలు శక్తులు సామాజిక మాద్యమాల వేదికగా దుష్ప్రచారం చేస్తున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి. అమరావతి ప్రాంతంలో పవన్ కల్యాణ్ కు 62 ఎకరాల మేర భూములు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాయి.
రైతుల కోసం స్వచ్ఛందంగా వచ్చి పోరాడుతున్న పవన్ పై ఈ తరహా అసత్య కథనాలు వస్తున్నాయిని తెలిపాయి. పవన్ పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి.. కల్పిత వార్తలు పత్రికలలోనూ ప్రచురితం అయ్యాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, అలాంటివారిపై పరువునష్టం దావా వేస్తున్నామని జనసేన పార్టీ న్యాయవిభాగం వెల్లడించింది. న్విస్వార్థ రాజకీయ నాయకుడు, ప్రజా సంక్షేమ, ప్రజాబీష్టంతోనే ముందుకెళ్లే నేతపై అవినీతి మకిలి అంటించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డింది.
ఈ ప్రచారానికి కారకులైన వారికి లీగల్ నోటీసులు పంపుతామని జనసేన పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ ఓ ప్రకటనలో తెలిపారు. జనసేనను రాజకీయంగా ఎదుర్కోలేక, జనసేన సాగిస్తున్న ప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడుండడంతో ఎదురునిలిచి పోరాడలేని అల్పులే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతి రైతులు గోడును అది నుంచి ఆలకిస్తూ.. వారికి అండగా నిలిచి పోరాటం చేస్తున్న శక్తిని ఎదుర్కోనలేకే ఈ దుష్ప్రచారాలు సాగుతున్నాయని అరోపించారు
లాంగ్ మార్చ్ వాయిదా.. త్వరలోనే తేదీ వెల్లడి:
ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి కోసం సంయుక్త పోరాటాలు చేయాలని రెండు పార్టీల నాయకత్వాలు నిశ్చయించాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ దేశ రాజధానిలో ప్రకటించారు. అయితే ఇప్పుడా లాంగ్ మార్చ్ కార్యక్రమం వాయిదా పడింది. త్వరలోనే తాజా కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం తెలిపారు. లాంగ్ మార్చ్ ఎప్పుడు నిర్వహించేది తదుపరి నిర్ణయిస్తామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more