టీడీపీ నేత, గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ పై మరో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. రాజధాని తరలింపు.. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుపై అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన రోజున వాటిని వ్యతిరేకిస్తూ అమరావతి జేఏసీ ఇచ్చిన ఛలో అసెంబ్లీ పిలుపుమేరకు పోలీసుల అంక్షలు, భద్రతను దాటుకుంటూ ఏకంగా అసెంబ్లీ వరకు జేఏసీ నాయకులతో కలసి చేరుకున్న ఆయనపై మరో కేసును కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులోనూ ఆయనను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చేందుకు పోలీసులు అయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా అసెంబ్లీ ముట్టడి రోజున గల్లాను పోలీసులు అరెస్ట్ చేసి, పలు పోలిస్ స్టేషన్లు తిప్పి.. చివరకు అర్థరాత్రి ఆయనను మెజిస్ట్రేటు ఎదుట హాజరుపర్చి.. ఉదయాన్నే గుంటూరు సబ్ జైలుకు తరలించగా, అదే రోజు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలైన విషయం తెలిసిందే. కాగా మరోమారు గల్లా, ఆయన అనుచరులు చిట్టి బాబు, వినయ్, దామోదర్ చౌదరి తదితరులపై కొంతమంది కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదుపై తుళ్లూరు పీఎస్ లో క్రైమ్ నంబర్ 31/2020 నమోదైంది. రెడ్ విత్ 149తో పాటు ఐపీసీలోని 143, 188, 353, 324, 332 తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది.
గల్లా జయదేవ్ బందోబస్తు విధుల్లో ఉన్న తమపై దౌర్జన్యానికి ప్రేరేపించారని గుంటూరు జిల్లా దుర్గి మండలం ముటుకూరు హెడ్ కానిస్టేబుల్ పెరంబదూరి వేణుగోపాలస్వామి ఫిర్యాదు చేశాడు. తమను నెట్టుకుంటూ అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని, దీంతో అవే సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 31గా రెండో కేసును పెట్టినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆందోళనకారులు గుంపుగా వచ్చి సచివాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వేళ, వారిని వెనక్కు పంపేందుకు తాము ప్రయత్నిస్తుండగా, వీళ్లను రాళ్లతో కొట్టాలంటూ, కొందరు రాళ్లు విసిరారని, వాటిల్లో ఒకటి తన కుడి కంటి పైభాగంలో తగిలిందని ఏఆర్ కానిస్టేబుల్ గజ్జల హరీశ్ ఫిర్యాదు చేశారు.
గాది లింగం అనే మరో కానిస్టేబుల్ కు నుదుటిపైనా, రాజమండ్రికి చెందిన నాగరాజు, వీరప్పనాయక్ అనే పోలీసులకు ఇతర చోట్ల గాయాలు అయ్యాయని, ఇక్కడి తీవ్రతను గమనించిన ఫోర్స్, తమను రక్షించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆపై తాము విచారించగా, గల్లా జయదేవ్ తో పాటు మరికొందరు దాడి చేసినట్టు వెల్లడైందని అన్నారు. ఇక ఈ కేసులో జయదేవ్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజా ప్రతినిధులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని టీడీపీ వారు ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more