మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై విషయమై దాఖలైన పిటీషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యంను రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. కాగా, అభివృద్ది వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు ప్రస్తుతం శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు.
దీంతో బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కాగా విచారణ జరగకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు తరలిస్తారని, విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది అశోక్ భాన్ కోరారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి విచారణ పూర్తయ్యే వరకు కార్యాలయాలు తరలించకూడదని అదేశాలను జారీ చేశారు. ఒకవేళ కార్యాలయాలను తరలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదన హైకోర్టు గుర్తించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది అశోక్ భాన్ పేర్కొన్నారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం దాచిపెట్టిందని.. దానిని వెంటనే బయటపెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరినట్లు అశోక్ భాన్ తెలిపారు. నివేదికలు అన్నింటినీ కేసుకు సంబంధించిన వారికి తప్పనిసరిగా అందజేయాలని అడ్వొకేట్ జనరల్ ను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించినట్లు చెప్పారు. కార్యాలయాల తరలింపునకు సంబంధించి చట్టం ఆమోదించేవరకు ఈ అంశంలో ప్రభుత్వం ముందుకెళ్లరాదని హైకోర్టు ఆదేశించినట్లు అశోక్ భాన్ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more