పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ విషయమై కేంద్రానికి ఊరట కల్పించింది. దాఖలైన పిటీషన్లను విచారించే క్రమంలో షౌరసత్వ సవరణ చట్టంపై ఎలాంటి స్టే ఇవ్వబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన కొత్త పిటిషన్లపై తమ స్పందన తెలియజేసేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.
ఈ క్రమంలో రాష్ట్రలలోని హైకోర్టులకు కూడా పలు అదేశాలు జారీ చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. అప్పటిదాకా సీఏఏపై హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టొద్దని, ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆదేశించింది. దీంతో పాటు సీఏఏను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని కోర్టు సూచనప్రాయంగా తెలిపింది. పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అంశంపై ఈ ధర్మాసనం ఐదు వారాల తర్వాత విచారణ జరుపుతుందని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 143 పిటిషన్లు దాఖలయ్యాయి. చట్టం రాజ్యాంగ చెల్లుబాటుతో పాటు సీఏఏ అమలుపై స్టే విధించాలని కోరుతూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్టానికి అనుకూలంగా కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపైనా సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. మరోవైపు అసోం, త్రిపురకు సంబంధించిన పిటిషన్లను వేరుగా విచారిస్తామని వెల్లడించారు. మధ్యంతర ఉత్తర్వులపై కూడా నాలుగు వారాల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదనలు వినిపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more