ఒంగోలులోని తాలుకా పోలీస్ స్టేషన్ కి సైకిల్ సామాన్య యువకుడు వెళ్లి.. తన మొబైల్ ఫోన్ పోయిందని పిర్యాదు చేశాడు. దీంతో స్టేషన్ లోని ఓ కానిస్టేబుల్ తన మొబైల్ ఫోన్ వివరాలతో పాటు తన వివరాలను కూడా తీసుకుని మమ అనిపించేశాడు. అయితే తన మొబైల్ పోయిందని ఎఫ్ఐఆర్ కాఫీ ఇవ్వాలని సదరు యువకుడు పోలీసులను అడిగాడు. పోయింది సెల్ ఫోనేగా.. అంటూ తీసిపాడేశారు అక్కడి పోలీసులు. ఇక మరికొందరు అంత ఖరీదైన సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు నువ్వే జాగ్రత్తగా వుండాలి కానీ.. పోయిన తరువాత పోలీసుల వద్దకు వచ్చి ఎప్ఐఆర్ కావాలని పేచి పెడితే ఎలా అంటూ మరికొందరు ఉచిత సలహా ఇచ్చారు.
పోలీసుల వద్దకు ఎవరు వచ్చినా.. వారి పిర్యాదును స్వీకరించి.. ఆ వెంటనే పిర్యాదుదారుడు డిమాండ్ చేస్తే.. ఎఫ్ఐఆర్ కాఫీ కూడా ఇవ్వాలన్నది విధి కదా.? అంటూ యువకుడు ప్రశ్నించారు. మొబైల్ ఫోన్ పోయిందంటేనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇలా క్వాశ్చన్ చేసిన యువకుడిని కళ్లతో కింద నుంచి పైకి స్కాన్ చేయడం ప్రారంభించారు. రైటర్ మాత్రమే కాదు.. స్టేషన్ లోకి ఎంటైర్ అవుతున్న క్రమంలో సెంట్రీ మొదలు.. కానిస్టేబుల్ వరకు అందరూ యువకుడి పట్ల నిర్లక్ష్యంగానే మాట్లాడారు. రోజూ వందల ఫోన్లు పోతూ ఉంటాయని.. అన్నింటికీ కేసులు రాయలేమని చెప్పారు.
ఇక స్టేషన్ రైటర్ అయితే మొబైల్ ఫోన్ పై వివరాలు తీసుకోవడమే ఎక్కువ.. అలాంటిది దానిపై ఎఫ్ఐఆర్ కూడా రాసి పట్టుకోవాలంటే.. స్టేషన్ మూసుకోవాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దాదాపు రెండు, మూడు గంటలపాటు.. సదరు యువకుడు అక్కడ వెయిట్ చేశాడు. అంతసేపు ఈ యువకుడు ఎప్పుడు వెళ్లిపోతాడా అని చూసినవాళ్లే కానీ.. కనీసం కూర్చోమని చెప్పిన పోలీసు కరువయ్యాడు. ఇలా మూడు గంటలు గడిచిన తరువాత.. ఇక సదరు యువకుడు తన ఐడెంటినీని చెప్పక తప్పలేదు. దీంతో అక్కడున్న సిబ్బంది అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
వెంటనే తేరుకుని... గత మూడు గంటలుగా తమతో ఎఫ్ఐఆర్ కావాలని వాదించిన వ్యక్తి సామాన్య యువకుడు కాదని.. ఓ ట్రైనీ ఐపీఎస్ అని తెలుసుకున్న పోలీసులంతా ఒక్క క్షణంలో నిజంగా పోలీసులుగా వ్యవహరించారు. అప్పటివరకు నిర్లక్ష్యంగా మాట్లాడిన పోలీసులు.. అప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసులా ప్రవర్తించారు. ఆ ట్రైనీ ఐపీఎస్ అధికారి జగదీష్ జరిగిన ఘటనపై.. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కు లేఖ రాశారు. పోలిస్ స్టేషన్ లోని సిబ్బంది విధులు సరిగా నిర్వర్తించకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని లేఖలో పేర్కోన్నారు.
దీంతో ట్రైనీ ఐపీఎస్ జగదీశ్.. స్టేషన్ లో పోలీసు సిబ్బంది.. తన ఎంట్రీ నుంచి ఐడెంటిటీ రివీల్ చేసే వరకు అక్కడి వారు వ్యవహరించిన తీరు.. తనపై పరుష పదజాలంతో మాట్లాడిన మాటలు మొత్తం వివరిస్తూ... ఎస్పీకి వివరణాత్మక లేఖ రాశారు. ఆయన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా ఎఫ్ఐఆర్ రాయకుండా.. పిర్యాదుదారుడికి ఎఫ్ఐఆర్ కాఫీని ఇవ్వకుండా పరుషపదజాలంతో వ్యవహరించిన రైటర్ ను తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా, విధులు సక్రమంగా వ్యవహరించని ఇతర పోలీసులపై కూడా క్రమశిక్షణా రాహిత్యం కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more