బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో బాంబుందన్న సమాచారం అందడంతో.. ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. ఒక్కసారిగా సల్మాన్ ఖాన్ నివాసముండే గ్యాలక్సీ అపార్టుమెంట్ల ప్రాంతమంతా హై సెక్యూరిటీ ప్రాంతంగా మారిపోయింది. అందుకు కారణం మరో రెండు గంటల్లో బాంబు పేలిపోతుందని.. చెప్పడమే. దీంతో పోలీసులు అప్రమత్తమై అనువనువూ గాలించి ఏ బాంబు లేదని.. నిర్థారించుకున్న తరువాత ఊపిరిపీల్చుకున్నారు. అయితే తమకు ఈ తప్పుడు సమాచారం అందించిన వ్యక్తి ఎవరని ఆరా తీశారు.
తీరా ఆ యువకుడు పదహారేళ్ల బాలుడని.. పోలీసులకు నకిలీ ఈ మెయిల్ పంపించి పరుగులు పెట్టించాడని తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని బాంద్రా ఏరియాలో గల గెలాక్సీ అపార్ట్మెంట్లోని సల్మాన్ఖాన్ ఇంట్లో పెట్టిన బాంబు రెండు గంటల్లో పేలనుందని, ఆపే సత్తా ఉంటే ఆపుకోమని బాంద్రా పోలీస్ స్టేషన్కు ఈ నెల 4న ఈమెయిల్ లో సవాల్ విసిరాడు. మెయిల్ చూసిన పోలీసులు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి సల్మాన్ ఇంటికి వెళ్లి చెక్ చేశారు. దాదాపు నాలుగుగంటల పాటు అణువణువూ గాలించారు.
ఆ సమయంలో సల్మాన్ ఇంట్లో లేరు. ఇంట్లో ఉన్న సల్మాన్ తండ్రి సలీమ్ను, సోదరి అర్పితను పోలీసులు ముందే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు బాంబు దొరక్కపోవడంతో నకిలీ ఈ మెయిల్గా భావించి, మెయిల్ ఆధారంగా బాలుడిని ఘజియాబాద్ ప్రాంతవాసిగా గుర్తించారు. అనంతరం పోలీసుల బృందం నిందితుడి కోసం ఘజియాబాద్కు వెళ్లగా, భయపడిన బాలుడు స్థానిక టిస్ హజారీ కోర్టులో దాక్కున్నాడు. దీంతో న్యాయవాది అయిన బాలుడి సోదరుడిని కలిసిన బాంద్రా పోలీసులు అతని ద్వారా బాలుడిని ఒప్పించి ఇంటికి రప్పించారు. తర్వాత పోలీసుల ముందు హాజరు కావాల్సిందిగా కోర్టు ఇచ్చిన నోటీసును అతనికి చూపించి తమ వెంట తీసుకెళ్లి విచారించారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు అతడిని విడిచిపెట్టామని పోలీసులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more