పుట్టిన రోజున ఆలయ దర్శనానికి వెళ్లివస్తానని చెప్పిన యువతి విగతజీవిగా మారిన దారుణ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పైశాచిక మృగాళ్ల కామధాహానికి యువతి బలైంది. కన్నుమిన్ను కానని మృగాళ్లు యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడటంతో అమె అసువులు బాసింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హన్మకొండలోని దీనదయాళ్నగర్కి చెందిన 19 ఏళ్ల యువతి.. తన పుట్టిన రోజు సందర్భంగా ఆలయానికి వెళ్లి వస్తానని ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో త్వరగా తిరిగివచ్చయ్ అమ్మా.. అంటూ ఆ యువతికి తల్లి చెప్పింది. తల్లి చెప్పిన మాటలు తన చెవిన పడటంతో సరే అనుకుంటూ ఆనందంగా ఇంట్లోంచి కాలు బయటపెట్టిన యువతి.. ఎంతకీ తిరగిరాలేదు. గంటా, రెండు గంటలు, ఇలా రాత్రి కావస్తున్నా తమ బిడ్డ ఇంటికి తిరిగిరాకపోవడంతో.. అందోళనకు గురైన తల్లిదండ్రులు అమెకు ఫోన్ చేశారు. అమె ఫోన్ స్విచ్ఛాప్ చేసింది వుంది. దీంతో ఆలయంతో పాటు చుట్టుపక్కల అనేక పరిసరాలను వెతికినా అమె ఆచూకీని కుటుంబసభ్యులు కనిపెట్టలేకపోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో రాత్రి పది గంటలకు హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో ఓ యువతి మృతదేహం పడివున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువతి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని.. విగతజీవిగా పడివున్న తమ బిడ్డను చూసి.. మరణించింది తమ బిడ్డేనని గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. పుట్టిన రోజునాడే నూరేళ్లు నిండిపోయాయా.? తల్లి అంటూ శోకసంధ్రంలో మునిగారు. బిడ్డను చూసి తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించగా.. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. కానీ మర్మాంగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు. యువతి మృతదేహం వున్న ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటం.. పక్కనే బీర్ సీసాలు ఉండటంతో.. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. యువతి గుడి నుంచి ఎక్కడికి వెళ్లింది..? అమెను ఎవరు ఫాలో అయ్యారు.? లేక అమెకు ఎమైనా ప్రేమ వ్యవహారాలు వున్నాయా.? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more