chennai newly wed honeymoon trip turns tragedic హనీమూన్ విషాదం: భార్య కళ్లముందే భర్త మృతి..

Newly wed honeymoon trip turns tragedic wife watches husband dying

Tragic incident, Honeymoon, Arvind, priti, Newly married couple, Manali, paragliding, civic news of chennai, chennai news, chennai civic news, accident, Tamil Nadu, Crime

In a tragic incident, a newly wed Chennai man who was on his honeymoon trip has died in a paragliding accident in Manali on Monday. This tragedy happened while his wife was watching him.

కొత్తజంట హనీమూన్ లో విషాదం.. భార్య కళ్లముందే భర్త మృతి..

Posted: 11/21/2019 01:27 PM IST
Newly wed honeymoon trip turns tragedic wife watches husband dying

కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవ వధువు పసుపు కుంకుమలు కోల్పోయింది. తన కళ్ల ముందే తనతో వచ్చిన భర్త రాలిపోతుంటే ఏం చేయాలో తెలియక ఆమె ఆర్తనాధలు పెట్టింది. నవ వధువు గుండె పలిగేలా ఏడ్చినా.. ఆ దేవుడు కనికరంచలేదు. ప్యారా గ్లైడింగ్ బెల్టును వదులుగా కట్టుకోవడంతో.. జరగకూడని విషాదం సంభవించి అంతా చూస్తుండగానే అనంత వాయువుల్లో కలసిపోయాడు. గతవారమే తమది కూడా అందరిలా ఏడేడు జన్మల బంధమంటూ పెద్దల ఆశీర్వచనాల మధ్య ఒకటైన అరవింద్, ప్రీతి జంటను.. హనీమూన్ పర్యటన వేరు చేసింది.

మనాలీ పేరు చెబితే అమెకు తన భర్త మరణించిన దృష్యమే కళ్లముందు కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన అరవింద్‌ (27), ప్రీతిలకు ఈ నెల 10వ తేదీని పెద్దలు కుదిర్చిన శుభముహూర్తన వివాహం జరిగింది. పెళ్లి తరువాత ఇరువురు కుటుంబాలు నవజంటను హనీమూన్ కు పంపారు.  హిమాచల్‌ ప్రదేశ్‌ లోని మనాలికి హనీమూన్ కు వెళ్లిన ఈ జంట.. ధోబి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పలువురు ఔత్సాహికులు ప్యారాగ్లైడింగ్‌ చేస్తుంటే చూసిన అరవింద్, టికెట్‌ కొనుగోలు చేసి, ప్యారాగ్లైడర్‌ పైలట్‌ హరూరామ్‌ తో కలిసి విహారానికి వెళ్లాడు.

భర్త ప్యారాగ్లైడింగ్ చేస్తున్న దృష్యాన్ని భార్య ప్రీతి కింద నుంచి ఆసక్తిగా చూస్తోంది. ఈ విషయాన్ని గమనించిన అరవింద్ అమెను చూస్తూ తన నడుముకు బలంగా కట్టుకోవాల్సిన సెక్యూరిటీ బెల్ట్ ను వదులుగా కట్టుకున్నాడు. అలాగే గాల్లో చక్కర్లు కొట్టాడు. ఇంతలో నడుముకు కట్టుకున్న బెల్ట్‌ ఉన్నట్టుండి ఊడిపోయింది. దీంతో అల్లంత ఎత్తు నుంచి కింద ఉన్న పల్లంలో పడిపోయి, తీవ్ర గాయాలపాలై, అక్కడికక్కడే మరణించాడు. ప్యారాగ్లైడర్ హరూరామ్ కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో తీవ్రగాయాలపాలై చికిత్స పోందుతూ.. ఆసుపత్రిలో మరణించాడు.

అరవింద్ స్థానికంగా వుండే ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుండగా, అతని సతీమణి ప్రీతి కెనరా బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. కాగా ఈ ఘటనతో యుక్తప్రాయంలో ఒంటరైన బాధిత కుటుంబానికి పరిహారం కల్పించాలని అరవింద్ సోదరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తో చెన్నైలోని అమిన్ జీ కారాయ్ మార్కెట్ వెనుకనున్న తిరువీధి అమ్మాన్ కోయిల్ తొలి వీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అరవింద్ వివాహం సందర్భంగా ఆ ఇంటికి చేసిన అలంకారాలు. కట్టిన మామిడి తోరణాలు తీయకముందే ఇలాంటి విషాదం సంభవించిందని స్థానికులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tragic incident  Honeymoon  Arvind  priti  Newly married couple  Manali  Tamil Nadu  Crime  

Other Articles