జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార వైసీపీ నేతలపై మరోమారు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశ రాజధాని హస్తిన పర్యటనలో వున్న ఆయన తన బిజీ షెడ్యూల్ నేపథ్యంలోనూ అధికార వైసీపీపై విమర్శలకు ఏమాత్రం అవకాశం దొరికినా వదలకుండా టార్గెట్ చేస్తూనే వున్నారు. తాజాగా ఢిల్లీ నుండి కూడా ఆయన ట్విట్టర్ వేదికగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో 151 సీట్లతో వైసీపీకి ప్రజలు ఘన విజయాన్ని అందించి ఐదు నెలలు గడిచినా.. ప్రభుత్వం మాత్రం భవన నిర్మాణ కార్మికుల ప్రధాన సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఐదు నెలలుగా 35 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి ప్రభుత్వం ఏదైనా వుందా అంటే అది వైసీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. భవన నిర్మాణ రంగానికి చెందిన 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత కూడా అధికార వైసీపీకే దక్కుతుందని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. తమ వల్ల ఇబ్బందులకు గురవుతున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడం చేతకాని నాయకులు.. ఎంతసేపూ ప్రతిపక్షంలో వున్న పార్టీలపై విమర్శలు చేయడం.. వారిపై అసత్యాలను నిజాలుగా వక్రీకరించి.. ప్రజల దృష్టిని మళ్లించడం మాత్రం చేస్తున్నారని ఫైరయ్యారు.
అంతటితో ఆగని జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా తనదైన శైలిలో వైసీపీ పార్టీపై ఆంగ్ల దినపత్రికల కార్టూన్లతో దాడి చేశారు. ఢిల్లీలో జగన్ గురంచి ఇలా అనుకుంటున్నారంటూ ఓ కార్టూన్ ను షేర్ చేశారు. ఇందులో రెండు కాళ్లకు ఇసుక బస్తాలను కట్టుకుని... అతి కష్టంగా జగన్ ముందుకు నడుస్తున్నట్టు ఉంది. అంటే ఏపీలో వున్న ఇసుక సమస్య ఎంతటి ప్రాధాన్యం సాధించిందో ఈ కార్టూన్ స్పష్టం చేస్తుందన్నట్లు జనసేనాని దీనిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన ఎవరెవరిని కలవబోతున్నారు? వైసీపీపై కేంద్రానికి ఏం ఫిర్యాదు చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
This is what ‘Delhi’ feels about YCP leader Sri. Jagan Reddy. pic.twitter.com/BBTfoBzDVI
— Pawan Kalyan (@PawanKalyan) November 16, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more