మధ్యప్రదేశ్లో భారీ సెక్స్ స్కాండల్ బయటపడింది. ప్రభుత్వాధికారులతో పాటు రాజకీయ పార్టీల నేతలను, ఇంకా బడాబాబులు అందమైన అమ్మాయిల పేరుతో ఎర వేసి ముగ్గులోకి దించిన సెక్స్ స్కాండల్ లో వినిపించిన పేర్లలో తాజాగా తెరపైకి పాత్రికేయుల పాత్రకూడా వుందని తెలుస్తోంది. అమ్మాయిలను ఎరలో చిక్కని వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంచిన వారిలో పాత్రికేయులు కూడా వున్నారన్న వార్త సంచలనంగా మారింది.
దాదాపు 40 మంది కాల్ గర్ల్స్తో రాజకీయ నాయకులు, అధికారులకు వలపు వల వేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులకు వలపు వల వేసి, వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు గుర్తించి, వారివద్ద 92 హై క్వాలిటీ వీడియోలను, రెండు ల్యాప్టాప్లను, పలు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు మహిళల్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
ఈ భారీ హనీట్రాప్ తో పాటు బ్లాక్మెయిలింగ్ లో ప్రధాన నిందితురాలిగా అరోపణలు ఎదుర్కోంటున్న శ్వేత స్వప్నిల్ జైన్ అనే మహిళ ప్రస్తుతం పోలీసుల అదుపులో వుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అమెను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆమె.. బాలీవుడ్కు చెందిన బీ గ్రేడ్ నటీమణులతో పాటు, 40 మంది టాప్ క్లాస్ కాల్ గర్ల్స్తో ఒక ముఠాను ఏర్పాటు చేసింది. వారితో రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు వల వేసి, వారికి దగ్గరయ్యేలా చేసేది. సెక్స్ అంటూ వారిని లొంగదీసుకొని.. పడకగదికి రప్పించేది. తాను చెప్పిన గెస్ట్ హౌజ్ గానీ, ఫైవ్ స్టార్ హోటల్కు గానీ రావాలని వారికి చెప్పేది.
ఆమె చెప్పిన చోటుకు వెళ్లి, సదరు వ్యభిచారిణితో సెక్స్లో పాల్గొంటుండగానే.. ముందుగా ఏర్పాటు చేసిన మొబైల్ కెమెరా లేదా స్పై కెమెరాతో ఆ తతంగాన్ని వీడియో తీసి.. ఆ వీడియోలతో వారిని బ్లాక్మెయిల్ చేయించేది. అలా మొత్తం 92 హై క్వాలిటీ వీడియోలను హార్డ్ డిస్క్లలో భద్రపరిచిందామె. వాటితో రాజకీయ నాయకులను, అధికారులను బ్లాక్మెయిల్ చేయించి.. ఓ మాజీ సీఎం నుంచి విలాసవంతమైన బంగ్లాను కూడా దక్కించుకుంది. ప్రభుత్వ కాంట్రాక్టులను కూడా దక్కించుకుంది. దీనికి శ్వేత భర్త స్వప్నిల్ జైన్ కూడా సాయపడ్డట్లు పోలీసులు గుర్తించారు.
వీరి వలలో పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చిక్కుకున్నట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. భోపాల్ వేదికగా ఏళ్లుగా ఈ కుంభకోణం నడుస్తోందని, ఇందులో చిక్కుకున్న వారిలో 80 శాతం బీజేపీ నేతలు ఉన్నారని తెలిపారు. 20 శాతం కాంగ్రెస్ నేతలు ఉన్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ నేతలు ఉన్నా వారిని అరెస్టు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ హనీ ట్రాప్ స్కాండల్ లో ఆర్తి దయాల్ అనే మహిళ కూడా ఇలాగే కొనసాగిస్తుందన్న సమాచారంతో అమెను కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
వీరిని లోతుగా విచారించడంతో పాటు వీరి చెరలో పడ్డ బాధితులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు.. ఈ కేసులో పాత్రికేయుల పాత్ర కూడా వుందని తెలిపారు. ఓ హింది దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా విదులు నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు ఓ న్యూస్ ఛానెల్ కు చెందని కెమెరామెన్.. ఓ ప్రాంతీయ శాటిలైట్ ఛానెల్ యజమాని పాత్ర కూడా వున్నట్లు కనుగొన్నారు. వీరు ప్రభుత్వ అధికారులకు, నేతలకు వలపు వల వేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుల నుంచి సీడీలు, హార్డ్ డిస్క్ను సిట్ కు అప్పగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more