హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారయ్యారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డిని ప్రకటించారు. పద్మావతి పేనును అధికారికంగా ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పద్మావతి గత ఎన్నికల్లో కోదాడ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్ స్థానానికి పద్మావతి అభ్యర్థిత్వాని ప్రతిపాదనను రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తూ.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు.
అయితే.. పార్టీ సీనియర్ నేతలు రేవంత్పై మండిపడ్డారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారి నిర్ణయాలు పరిగణించాల్సిన అవసరం లేదనీ.. హుజూర్ నగర్ విషయంలో పక్క జిల్లాల నేతల సలహాలు అంతకన్నా అవసరం లేదని పార్టీ ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ టికెట్ విషయంలో ఏ వర్గం ప్రతిపాదనకు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసింది.
తెలంగాణ అసెంబ్లీకి 2018 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తరువాత ఏప్రిల్ నెలలో వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో ఆయన నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి లోక్సభకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో సిట్టింగ్ సీటును కాంగ్రెస్ ఆయన సతీమణికే కేటాయిస్తూ ఇవాళ ప్రకటనను విడుదల చేసింది.
అధికార టీఆర్ఎస్ పార్టీ గతంలో పోటీ చేసిన అభ్యర్థినే బరిలోకి దింపింది. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి టీఆర్ఎస్ అధిష్టానం సైదిరెడ్డి పేరును ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ ఆయనకు ఇప్పటికే బీ-ఫారం కూడా అందజేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిపై బీజేపీ సుదీర్ఘంగా చర్చిస్తోంది. శ్రీకళారెడ్డి ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై మంగళవారం సమావేశమైన రాష్ట్ర కోర్ కమిటీ.. ఈ అంశంపై దాదాపు గంటన్నరకు పైగా చర్చించి కళావతిని పేరును ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more