భారతదేశంలో మొదటి ప్రైవేట్ రైలును ఐఆర్సీటీసీ నడపనుంది. ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ప్రైవేట్ రైలు ‘తేజస్ ఎక్స్ప్రెస్’ చక్కర్లు కొట్టనుంది. ఈ ప్రైవేట్ రైలులో పలు ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి ప్రైవేట్ రైలు అందుబాటులోకి రానుంది. తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభించబోతున్నాయి. విమానంలో అడిగిన వెంటనే సౌకర్యాలను అందించే ఎయిర్ హాస్టెస్ లు వున్నట్లుగానే రైల్ హాస్టెస్ లు కూడా ఇక ప్రైవేటు రైళ్లలో కనిపించనున్నారు. ఇక ఈ రైళ్లలో ప్రయాణమంటే ఎగిరిగంతేయాల్సిందే.!
ఇండియన్ రైల్వేస్ నడిపించే రైళ్ల విషయంలో ప్రయాణికులు ఎక్కువగా ఫిర్యాదు చేసేది సమయపాలన గురించే. రైళ్లు ఎప్పుడూ సమయానికి స్టేషన్లకు రావన్న పిర్యాదుతు ఎప్పుడూ ఉండేవే. అయితే దీనిని ప్రైవేట్ రైళ్లు అధిగమించనున్నాయి. అలా అన్ని ఏర్పాటు కూడా చేసుకోనున్నాయి. ఈ రైళ్లు సమయానికే గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించనుంది ఐఆర్సీటీసీ. రైలు గంట కన్నా ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికుల ఇ-వ్యాలెట్ లో కొంతడబ్బు జమ చేయాలని లేదా భవిష్యత్తులో బుక్ చేసే టికెట్లపై తగ్గింపు ఆఫర్ చేయాలని ఐఆర్సీటీసీ భావిస్తోంది.
మొదట ఢిల్లీ-లక్నో మధ్య తేజస్ ఎక్స్ప్రెస్ నడిపించనుంది ఐఆర్సీటీసీ. ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పుచేర్పులు చేసి ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్ప్రెస్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్లో టీ, కాఫీ వెండింగ్ మెషీన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఐఆర్సీటీసీ. ఇక ఎయిర్లైన్స్ తరహాలో తేజస్ ఎక్స్ప్రెస్లో టాయిలెట్లను తీర్చిదిద్దబోతోంది. ప్రతీ కోచ్లో అత్యాధునిక సౌకర్యాలతో రెండు టాయిలెట్స్ ఉంటాయి. ప్రస్తుతం ఇవన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కే నాటికి సౌకర్యాలు, సదుపాయాల గురించి స్పష్టత రానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more