ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ పరాజయానికి కారణాలను లోతుగా అధ్యయనం చేసుకుంటూ వరుస సమావేశాలలో బిజీగా మారిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఇక క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తలతోనూ ఓటమిపై విశ్లేషించుకునేలా కార్యచరణ రూపొందించుకున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వస్తున్నాయి, ఇందులో భాగంగా ఆయన తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ నెల 4, 5 తేధీలలో ఈమేరకు ఆయన పశ్చిమ గోదావరిలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైందని కూడా పేర్కోన్నాయి. ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులతో కలసి ఆయన రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్ధాంతం, పెనుగొండ మీదుగా భీమవరం వెళతారు. అదే రోజు సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జనసేనాని సమావేశం కానున్నారు.
ఆ మరుసటి రోజు నరసాపురం పార్లమెంటరీ స్థానంలో పర్యటించనున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో కార్యకర్తలతో ముఖాముఖిలో పాల్గొని పార్టీ పరాజయానికి గల కారణాలను విశ్లేషణ చేసుకుంటారు. దీంతో పాటు పార్టీ ఆరంభం నుంచి ఇదే నియోజకవర్గం పరిధిలో కీలకంగా వ్యవహరించిన కార్యకర్త మురళీకృష్ణ అకస్మిక మృతి పట్ల అప్పట్లో సానుభూతి వ్యక్తం చేసిన పవన్.. ఈ పర్యటనలో ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మురళీకృష్ణ ఇటీవల కేన్సర్ వ్యాధితో మరణించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more