మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నాయన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని పందిగుట్టపై లింగన్న దళం వుందని పక్కగా ఉప్పందడంతో.. వారిని చుట్టుముట్టి జరిపిన ఎన్ కౌంటర్లో న్యూ డెమొక్రసీ దళ కమాండర్ లింగన్న మృతిచెందాడు. ఈ క్రమంలో పోలీసులు లింగన్న మృతదేహాన్ని తరలిస్తుండగా, స్థానిక అటవీప్రాంతంలోని ప్రజలు ఎదురుతిరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని పందిగుట్టపై గత మూడు రోజులుగా లింగన్న దళం అక్కడే వుందన్న పక్కా సమాచారంతో పోలీసులు చుట్టుముట్టారు. అప్రమత్తమైన మావోలు పోలీసులపైకి కాల్పులకు పాల్పడ్డారని, దీంతో ఎదురుకాల్పులకు పోలీసులు దిగారని, ఈ కాల్పుల్లో దళ కమాండర్ లింగన్న మృతి చెందగా, మరో ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, లింగన్న మృతిచెందిన సమాచారం అందుకున్న అడవి బిడ్డలు.. ఆయన మృతదేహాన్ని కూడా పోలీసులు తరలిస్తున్నారన్న సమాచారం పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులపై రాళ్లదాడికి దిగారు. లింగన్న మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులను ఘటనాస్థలం నుంచి తరిమేందుకు ప్రత్యామ్నాయం లేని పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
లింగన్న న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ఈ కాల్పుల అనంతరం రెండు గంటల పాటు ప్రజలు, మీడియాను పోలీసులు అనుమతించలేదు. ప్రజలు గొడవ చేయడంతో అనుమతించారు కానీ వారు వెళ్లేలోపు గుట్ట వెనుక వైపుగా లింగన్న మృతదేహంతో వెళ్లిపోయేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు యత్నించిన వారిపై ప్రజలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్కు గాయాలయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more