కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యం విషాదాంతమైంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు తన సంస్థను లాభాలబాటలో పయనింపజేసేందుకు ఆయన తన మిత్రులు, ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్న రుణాలే పెనుభారంగా తయారయ్యాయి. ఈ క్రమంతో రుణదాతల నుంచి ఒత్తడి తీవ్రవై ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఈ మేరకు కాఫీ డే సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కు రాసిన ఓ లేఖలో ఆయన పేర్కోన్నట్టు చెప్పబుతున్న విషయమే వాస్తవమని తెలుస్తోంది.
బెంగళూరు నుంచి సకలేష్ పూర్ కు వ్యాపార వ్యవహార నిమిత్తమై సోమవారం రాత్రి బయలుదేరిన ఆయన మంగళూరుకు చేరుకునే క్రమంలో అదృశ్యమయ్యారు. మంగళూరులోని ఉల్లాల్లో బ్రిడ్జిపై నుంచి ఆయన నేత్రవతి నదిలకి దూకేసి ఆత్మహత్యకు పాల్పడినట్టు వచ్చిన వార్తల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితంగా ఇవాళ ఉదయం నేత్రావతి బ్యాక్ వాటర్ లో ఆయన మృతదేహం లభ్యమైంది.
సిద్ధార్థ్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మంగళూరులోని వెన్ లాక్ ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇక సిద్ధార్థ మృతదేహం లభ్యమయిందని తెలిసిన వెంటనే ఆయన బంధుమిత్రులు వెన్ లాక్ ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్నటివరకూ తమ మధ్య తిరిగిన వ్యక్తి, ఇప్పుడు లేడంటే నమ్మలేకున్నామని అంటున్నారు. మరోవైపు మంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఉన్న కేఫ్ కాఫీ డే రెస్టారెంట్లు, ఔట్ లెట్ల ఉద్యోగులు సిద్ధార్థ్ కు నివాళులు అర్పిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more