దేశ రాజధాని హస్తిన సాక్షిగా కేంద్రంలోని అధికార బీజేపి పార్టీ కార్యాలయంలో ప్రేస్ మీట్ పెట్టిన ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై అగంతకుడు చెప్పు విసిరిన ఘటన తరువాత.. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో అతని వాహనంపైకి ఎక్కి మరీ చెంపపై కోట్టిన అగంతకులు ఘటనలను మరువక ముందే మరో ఘటన దక్షిణాదిలో చోటుచేసుకుంది. విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ పై కూడా అగంతకులు చెప్పులు విసరారు.
స్వతంత్ర్య భారతావణిలో తొలి ఉగ్రవాది హిందువేనని, అతని పేరే నాథూరామ్ గాడ్సే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ పై ఇప్పటికే కేసులు పెట్టిన బీజేపీ అనుబంధ సంస్థలు.. తమ అక్రోశం చల్లారకపోవడంతో అతనిపై దాడికి యత్నించారు. హిందూ ఉగ్రవాదం సహా నాథూరామ్ గాడ్సేపై కమల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హిందూ సంఘాల కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుప్పారన్క కుండ్రం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ ర్యాలీలో కమల్ పాల్గొన్న వేళ, ఓ వ్యక్తి కమల్ పైకి చెప్పును విసిరాడు.
అయితే, అది ఆయన పక్క నుంచి వెళ్లింది. ఈ ఘటనను చూసిన మరికొందరు సైతం కమల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు. వారిని ముందుగానే గుర్తించిన పోలీసులు, కమల్ చుట్టూ రక్షణగా నిలబడి, వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై కొందరు బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమ సేన కార్యకర్తలపైనా కేసు నమోదైంది. కాగా, రెండు రోజుల క్రితం కమల్ హాసన్ మాట్లాడుతూ, మొట్టమొదటి ఉగ్రవాది గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన మాటలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్నే రేపాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more