భయంకర ఫెను తుఫానుగా మారి ఒడిషా రాష్ట్రంలోని పూరి వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ కేంద్ర హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నియమావళిని ఎత్తివేశారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేశారు. ఫణి తుఫాన్ వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని.. ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరిన నేపథ్యంలో దానిపై సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఒడిశా రాష్ట్రంలోని మొత్తం 11 తీర ప్రాంత జిల్లాల్లో నియమావళిని ఎత్తివేశారు. జగత్సింగ్ పూర్, కేంద్రపర, భద్రక్, బాలాసోర్, మయూర్బంజ్, జైపూర్, గజపతి, గంజాం, ఖుర్ధా, కటక్, జైపూర్ జిల్లాలు ఉన్నాయి. ఎన్నికల్లో భాగంగా ఒడిశా 21 స్థానాల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. నాలుగో దశ కింద ఏప్రిల్ 29వ తేదీన ఒడిశా రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయినా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలోనే ఫణి తుపాన్ వచ్చింది. గోపాల్ పూర్, చాంద్ బలి ప్రాంతాల మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ఇది చాలా తీవ్రమైన పెను తుఫాను కావటం.. సహాయ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉండటంతో కోడ్ ఎత్తివేస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఇస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
దక్షిణ పూరి ప్రాంతంలో మే 3వ తేదీన తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటే సమయంలో.. గంటకు 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ఢిల్లీకి ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్ వెళ్లారు. అక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను కలిశారు. ఫణి తుఫాన్ ప్రభావంపై చర్చించారు. తీవ్ర ప్రమాద హెచ్చరికలుండడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని కోరారు. అలాగే మే 19కి వాయిదా పడిన పాట్కుర అసెంబ్లీ నియోజవర్గ ఎన్నికను కూడా వాయిదా వేయాలని కోరారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై మాత్రం ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపిన ప్రభుత్వం ఎక్కడ ఏలాంటి ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదేశించింది. వీరికి తోడు నౌకాదళం, తీరప్రాంత రక్షణ దళం, విపత్తు నిర్వాహణ ఏర్పాట్లు చేస్తున్నాయి. మే 2 నుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది అక్కడి విద్యాశాఖ. తీర ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లకు ఇది వర్తిస్తుందని..మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు సెలవులుంటాయని తెలిపింది. పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు..మళ్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. మరోవైపు అక్కడి వైద్యశాఖను అలర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
వైద్యులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేసింది. సెలవులను రద్దు చేసింది వైద్య శాఖ. మే 15 వరకు విధులకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే సెలవుల్లో ఉన్న వారు ఉన్న ఫలంగా హెడ్ క్వార్టర్కు రిపోర్టు చేయాలంది. అత్యవసర సేవలకు అవసరమయ్యే మందులు, ఇతరత్రా వాటిని ముందే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలని తెలిపింది. గోపాల్ పూర్ - చాంద్బలి మధ్య మే 3వ తేదీన తీరం దాటనున్నట్లు ప్రకటించింది వాతావరణ శాఖ. ఇవాళ మధ్యాహ్నానానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన ఫణి.. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more