నిజామాబాద్ లోక్ సభ స్థానంపై తెలంగాణలో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది. ముందస్తుగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఏకఫక్షంగా విజయం సాధించిన కేసీఆర్ ప్రభుత్వంపై ఇప్పటికీ ఈవీఎంలను మ్యానేజ్ చేసిన గెలిచారన్న అరోపణలు వస్తున్న క్రమంలో.. ఆయన కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ లో వందల సంఖ్యలో రైతులు ఎన్నికల బరిలోకి దిగి ఇక్కడ బ్యాలెట్ ఎన్నికలకు వెళ్లేలా చేయడం కూడా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తమ సమస్యలను పరిష్కరించాలని పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతుధర కల్పించాలని రైతులు గత కొన్నేళ్లుగా మొరపెట్టుకుంటున్నా.. ఆ దిశగా అమె చర్యలు తీసుకోకపోవడంతో రైతన్నలు అగ్రహించారు. దీంతో అమెపై పోటీగా లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు రైతులు. అమెకు ఎన్నికల ద్వారానే ఎదుర్కోవాలని భావించిన రైతులు అమెపై పోటీకి వందల సంఖ్యలో నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. ఐతే ఎంతమంది పోటీచేస్తున్నారన్న దానిపై కొన్నిరోజులుగా చర్చ జరుగుతోండగా... ఎట్టకేలకు నిజామాబాదులో పోటీచేసే ఎంపీ అభ్యర్థుల లెక్కతేలింది.
నిజామాబాదులో 205 మంది అభ్యర్థులు మొత్తం 245 నామినేషన్లు దాఖలుచేశారు. నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు.. 12 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. దాంతో నిజామాబాద్లో మొత్తం 193 మంది పోటీ చేయనున్నారు. అంటే ప్రస్తుత ఎంపీ కవితపై 192 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 183 మంది పసుపు, ఎర్రజొన్న రైతులే ఉన్నట్లు సమాచారం. ఐతే నిజామాబాద్ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ కీలకం కానుంది.
ఉపసంహరణకు మరో రెండు రోజులు గడువు ఉండడంతో ఎంత మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారన్నది తేలాల్సి ఉంది. అయితే ఇవాళ మాత్రం ఒక్క రైతు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదని సమాచారం. ఒకవేళ ఎవరూ విత్డ్రా చేయకుంటే మొత్తం 193 మంది నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీలో వున్నట్లే. దీంతో ఈ సారి ఇక్కడ బ్యాలెట్ పేపర్లతో కూడిన ఎన్నికలు జరగడం తప్పనిసరి కావచ్చు.
ఒక లోక్సభ స్థానానికి 64 కంటే ఎక్కువ మంది పోటీచేస్తే బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ సీఈవో రజత్ కుమార్ వెల్లడించారు. నిజామాబాద్లో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయని.. 194 గుర్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంకా ఎక్కువ మంది పోటీలో ఉన్నా గుర్తులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. నిజామాబాద్లో బ్యాలెట్ ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. రైతులు పెద్ద మొత్తంలో నామినేషన్లు ఉపసంహరించుకుంటేనే ఈవీఎం ఎన్నికలు జరుగుతాయి. లేదంటే బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more