పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత జగన్ నామినేషన్ వేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం అధికారులకు ఇవాళ మధ్యాహ్నం ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ పత్రాలను సమర్పించే ముందు ఆయన సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటుగా వైసీపీ నేతల సమక్షంలో ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు, పులివెందులలో జగన్ పై టీడీపీ అభ్యర్థి వెంకట సతీష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
అంతకుముందు సీఎస్ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన కడప గడ్డపై పుట్టినందుకు తానెంతో గర్వపడుతున్నానని, పులివెందులంటే వైఎస్ కుటుంబానికి ఎంతో ప్రేమని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు తమ కుటుంబంపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపుతూ వచ్చారని గుర్తు చేసుకున్నారు. కష్టంలోనూ గుండెధైర్యంతో ఎలా ఉండాలో తనకు ఈ గడ్డే నేర్పిందని అన్నారు. వందల నిందలు వేస్తున్నా, కుట్రలు చేస్తున్నా తొణకకుండా, బెదరకుండా, నిబ్బరంగా ఉండటాన్ని కూడా నేర్పించిందని చెప్పారు.
పులివెందులకు కృష్ణా నీరు తెచ్చేందుకు దివంగత మహానేత ప్రాజెక్టులను చేపడితే, జలయజ్ఞం, ధనయజ్ఞం అని విమర్శించిన వారు, ఇప్పుడు నీరు వచ్చేసరికి తామే ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మంచితనానికి విరుద్ధంగా చంద్రబాబు పాలన సాగుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. అధికారం కోసం సొంత మామపై కుట్ర చేసి, వెన్నుపోటు పొడిచి చంపేసిన చంద్రబాబు, తన పాలనలో కుప్పంకు కూడా ఏమీ చేయలేదని, ఇప్పుడు పులివెందులకు వచ్చి తానే మంచి చేశానని వితండవాదన చేస్తున్నారని అన్నారు.
పులివెందులలో జేఎన్టీయూ కాలేజీని, ట్రిపుల్ ఐటీ, అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, కడప నుంచి పులివెందులకు నాలుగు లైన్ల రహదారి, టీటీడీ ద్వారా అభివృద్ధి, 2,800 కోట్లతో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రతి మండల కేంద్రంలో కాలేజీ, నేషనల్ ఎకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్, పులివెందులకు రింగ్ రోడ్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, పైడిపాలెం ప్రాజెక్ట్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఎవరి హయాంలో వచ్చాయో చెప్పగలరా? అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more