రెండో పర్యాయం తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన కేసీఆర్.. 66 రోజుల తరువాత తన క్యాబినెట్ ను తొలిసారి విస్తరించారు. నలుగురు పాత మంత్రులకు మరోసారి క్యాబినెట్ లో స్థానం కల్పించిన సీఎం.. ఆరుగురు కొత్తవారికి కూడా తన మంత్రిమండలిలో చోటు కల్పించారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
నూతన మంత్రులుగా అల్లోళ్ల ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, వీ శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డిలు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన పదిమందికి ఇవాళ సాయంత్రం ఆయన శాఖలను ప్రకటించారు. ఆర్థిక, రెవెన్యూ, నీటి పారుదల, పట్టణాభివృద్ది, ఐటీ, సహా పలు కీలక శాఖలను తన వద్దే వుంచుకున్న కేసీఆర్.. మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఇంద్రకరణ్ రెడ్డీలకు మంత్రులుగా పదోన్నతి కల్పించారు.
ఈటెల రాజేందర్ - వైద్య ఆరోగ్య శాఖ
శ్రీనివాస్ గౌడ్ - ఎక్సైజ్, యువజన, క్రీడా, పర్యాటక శాఖలు
నిరంజన్ రెడ్డి - వ్యవసాయ శాఖ
ప్రశాంత్ రెడ్డి - రోడ్లు, భవనాలు, రవాణా శాఖలు
కొప్పుల ఈశ్వర్ - సంక్షేమ శాఖ
ఎర్రబెల్లి దయాకర్ రావు - పంచాయితీరాజ్ శాఖ
జగదీశ్వర్ రెడ్డి - విద్యాశాఖ వ్య
తలసాని శ్రీనివాస్ యాదవ్ - పశు సంవర్థక శాఖ
ఇంద్రకరణ్ రెడ్డి - న్యాయ, అటవీ, దేవాదాయ శాఖలు
మల్లారెడ్డి - కార్మిక శాఖ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more