TN ex-CS RamMohan Rao joins Janasena జనసేనలోకి తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు

Tamil nadu former cs rammohan rao appointed as pawan advisor

pawan kalyan, janasena, Pawan Kalyan Adivsor, TN ex-CS RamMohan Rao joins Janasena, TN ex-CS RamMohan Rao, andhra pradesh, politics

During the peak time before general elections and Andhra Pradesh assembly elections many educationalist join janasena, As a prt today Tamil Nadu former Chief Secretary RamMohan Rao too joins janasena and was appointed as JSP Chief Pawan Kalyan advisor.

జనసేనాని సలహాదారుడిగా తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు

Posted: 02/11/2019 04:27 PM IST
Tamil nadu former cs rammohan rao appointed as pawan advisor

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. మొన్నటివరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీవిరమణ చేసిన పి.రామ్మోహన్ రావు ఇవాళ తన కుటుంబంతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఇప్పటికే అనేక మంది విద్యాధికులు, మేధావులు, సామాజిక సేవాతత్పరులు, సమాజసేవ దృక్పథం వున్న అనేక మంది జనసేనలో చేరి వారి సేవలను పార్టీ కోసం వినియోగిస్తున్నారు.

ఈ క్రమంలో ఇవాళ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రామ్మోహన్ రావు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన పవన్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతేకాదు ఆయనకు పార్టీలో సముచిత స్థానం కూడా కల్పించి గౌరవించారు. ఈ సందర్భంగా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రామ్మోహన్ రావు జనసేనలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన్ను తన రాజకీయ సలహాదారుగా నియమిస్తున్నట్లు వెల్లడించారు.

రామ్మోహన్ రావుకు పబ్లిక్ పాలసీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉందనీ, జయలలిత ఆసుపత్రిలో ఉండగా, రామ్మోహన్ రావు ప్రభుత్వాన్ని నడిపారని పేర్కొన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి జనసేనలో చేరినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రామ్మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు నిజాయతీపరుడైన, తమకోసం పోరాడే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని వ్యాఖ్యానించారు.

ఏపీలో చాలా బలమైన శక్తులు పోటీ పడుతున్నాయని, రాజకీయం నడుపుతున్నాయని పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి పవన్ కల్యాణ్ సమక్షంలో ఈరోజు జనసేనలో చేరిన అనంతరం రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. యువత, పేదలు, మహిళల సంక్షేమం కోసం పవన్ రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని రామ్మోహన్ రావు కితాబిచ్చారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడం అన్నది చారిత్రక అవసరమని వ్యాఖ్యానించారు. పవన్ కోసం సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తానని హామీ ఇచ్చారు. పవన్ ను సీఎం పదవిలో చూడటానికి తనతో పాటు ప్రజలు ఆసక్తిగా ఉన్నారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Tamil Nadu ex-CS  RamMohan Rao  andhra pradesh  politics  

Other Articles