ఆంద్రప్రదేశ్ లో బీహార్, ఉత్తర్ ప్రదేశ్ తరహా కుల రాజకీయాలు వస్తే రాష్ట్ర అభివృద్ది కేవలం కొందరు కుటుంబాల అభివృద్దిగా మారిపోతుందుని జనసేన అధినేత, పపర్ స్టార్ పవన్ కల్యాణ్ అవేదన వ్యక్తం చేశారు. ఈ కులు రాజకీయాలతో ప్రజలెవరికీ అభివృద్ది ఫలాలు అందవని.. దీంతో భవిష్యత్ తరాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కోక్క పార్టీ ఓక్కొక్క సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ దానిని పెంచుకుంటూ పోతున్నాయని విమర్శించారు.
ఇది ఇలాగే కోనసాగితే తెలంగాణ రాష్ట్ర ఉధ్యమం తరహాలో ఏపీలో కులరాజకీయాల వ్యతిరేక ఉధ్యమాలు కూడా వస్తాయని అయన అందోళన వ్యక్తం చేశారు. కుల రాజకీయాలతో రాష్ట్రంలోని ప్రజానికంలో ఎవరికి సుఖశాంతులు వుండవని, దారుణ పరిస్థితులు ఎదురవుతాయని పవన్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది పనులకు కుల రాజకీయ వ్యవస్థ సమాధి వేస్తుందని అన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర పునర్విభనజన ఉధ్యమంలో చాలా నలిగిపోయారని పవన్ పేర్కోన్నారు.
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు టీడీపీ పార్టీకి రాజనామా చేసి జనసేనలో చేరిన సందర్భంగా ఆయనను సాదరంగా పార్టీలోకి అహ్వానించిన పవన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాజాగా అధికారంలోకి వచ్చే రాజకీయా నాయకులకు కులాలపైన సంపూర్ణమైన అవగాహన లేకపోతే సమాజాంలో అభద్రతాభావం ఏర్పడుతుందని, ప్రజల్లో అశాంతి నెలకొంటుందని అన్నారు. కుల రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తాను ఆయన ప్రభుత్వానికి మద్దుతు పలికానని పవన్ అన్నారు. అయితే కులరాజకీయాలను పెంచి పోషించి లబ్దిపోందే విధంగా టీడీపీ కూడా తయారైందని ఆయన విమర్శించారు.
అంతేకాదు రాష్ట్రంలోని ఏమూలనున్న నియోజకవర్గానికి వెళ్లినా వందల కోట్ల అవినీతి జరిగిందనన్నారు. ప్రజల్లో భద్రతాభావం కనిపించలేదని దుయ్యబట్టారు. అధికార ప్రభుత్వం శాంతిభద్రలను కాపాడలంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తమ పార్టీ నేతలు, సాక్షత్తు చట్టసభల్లో సభ్యులుగా వున్నవారు అధికారులపై దాడులు, అడపడుచులపై అకృత్యాలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నా.. అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నా వారిని నియంత్రించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని పవన్ ధ్వజమెత్తారు.
అనంతరం మాట్లాడిని రావెల కిషోర్ బాబు.. రాష్ట్రంలో వున్న రాజకీయ పార్టీలో తమ స్వార్థం, తమ పార్టీ నేతల స్వార్థాన్ని చూసుకోవడంలోనే నిమగ్నం అయ్యాయనన్నారు. ప్రజలకు ఎంతోకోంత సేవచేయగలిగే రాజకీయ వ్యవస్థ రావాలనే తాను జనసేనలో చేరినట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వాల హాయంలో ప్రజాస్వామ్యం దోపిడీస్వామ్యంగా మారిందని విమర్శించారు. త్మాభిమానాన్ని చంపుకోలేకే తాను అధికార టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేశానని చెప్పారు. కుల రాజకీయాలతో భవిష్యత్ తరానికి ఇబ్బందులు వస్తాయన్నారు.
కులం పట్టింపులు లేని సమాజం కోసం పవన్ నడుం చుట్టారని, ఈ మార్పు దేశ భవిష్యత్తకే పెనుమార్పుగా తయారవుతుందని అకాంక్షించిన తాను.. జనసేన సిద్దాంతాలు నచ్చి పార్టీలోకి చేరానన్నారు రావెల. పవన్ కులరహిత సమాజ వ్యవస్థను తీర్చిదిద్దే పోరాటంలో ాను సమిధగా మారేందుకు సిద్దమని అన్నారు. అవినీతి, దుర్మార్గాలతో వ్యవస్థలను ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయని రావెల అరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more